హీరో నాని, సాయిపల్లవి, కృతిశెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సినిమా విజయాన్ని చిత్రబృందం అభిమానులతో కలిసి పంచుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో గ్రేట్ యాక్టర్ ఆర్.నారాయణమూర్తి పాల్గొన్నారు. సక్సెస్ మీట్ లో నారాయణమూర్తి మాట్లాడుతూ ఏపీలో సినిమా థియేటర్లు మూసివేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా తీసేవాళ్లు, చూపించే వాళ్లు, చూసేవాళ్లు ముగ్గురూ బాగుంటేనే సినిమా రంగం బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఎవరూ థియేటర్లు మూసేయకండని సూచించారు. ప్రభుత్వంతో నెగెటివ్ గా కాకుండా పాజిటివ్ గా అప్రోచ్ అవ్వాలని కోరుకున్నారు. అటు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా సినిమా రంగం విషయంలో పాజిటివ్ గా స్పందించి సమస్యను పరిష్కరించాలని సభా ముఖంగా విజ్ఞప్తి చేశారు. సినిమా థియేటర్ యాజమాన్యం, నిర్మాతలు, అగ్ర హీరోలు అంతా ప్రభుత్వంతో చర్చించి సమస్యను ఓ కొలిక్కి తేవాలని సూచించారు. ఆర్.నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.