తెలుగు బుల్లితెర పై సూపర్ క్రేజ్ ఉన్న సెలబ్రిటీలలో సుడిగాలి సుధీర్ ఒకరు. కమెడియన్ గానే కాకుండా నటుడిగా, యాంకర్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అడపాదడపా సినిమాల్లో మెరిసే సుధీర్.. టీవీ షోలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవల ‘శ్రీదేవి డ్రామా కంపెనీ‘ కొత్త ప్రోమో రిలీజ్ అయింది. అయితే.. ఈ ఆదివారం ప్రసారం కాబోయే కొత్త ఎపిసోడ్ ప్రోమోలో అందరూ ఎంటర్టైన్ చేశారు. కానీ ఓ కమెడియన్ మాత్రం సుధీర్ పై పంచులు వేయడమే గాక సుధీర్ ఫ్యాన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో షోలో పాల్గొన్నవారు, ప్రేక్షకులు అంతా షాకయ్యారు.
సోషల్ మీడియాలో గానీ, బయట గానీ సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుధీర్ కి ఇంతటి క్రేజ్ రావడంలో యాంకర్ రష్మీ గౌతమ్ పాత్ర కూడా ఉంది. ఇక శ్రీదేవి డ్రామా షోలో సుధీర్ తనదైన శైలిలో యాంకరింగ్ తో మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా కొత్త ప్రోమోలో పంచ్ ప్రసాద్ వేసిన గెటప్, పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. ఈ వారం షోకి హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘సెబాస్టియన్’ సినిమా టీమ్ ప్రమోషన్స్ కోసం వచ్చింది.
ఈ నేపథ్యంలో ‘సెబాస్టియన్’ చిత్రబృందం ముందే సుధీర్ పై ఫైర్ అయ్యాడు పంచ్ ప్రసాద్. షోలో తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని పంచ్ ప్రసాద్ సెబాస్టియన్ బృందాన్ని అడిగాడు. ఆ టైంలో సుధీర్ వచ్చి.. ‘అయిపోయిందా?’ అన్నాడు. వెంటనే ప్రసాద్ ఆవేశంతో.. ‘నేనేదో ఆఫర్ల కోసం అడుక్కుంటుంటే.. మధ్యలో వస్తావేంటి? నీ ఫ్యాన్స్ నా విగ్గు కూడా పీకలేరు’ అంటూ ఫైర్ అయ్యాడు. తర్వాత కూల్ అయిపోయారు. కానీ సుధీర్ ని అలా అనడం పై ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. మరి వీడియోని మీరు కూడా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.