Dil Raju: టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు ఇంట సంబరాలు మొదలయ్యాయి. దిల్ రాజు భార్య వైగా రెడ్డి(తేజస్విని) ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులు నిర్మాత దిల్ రాజు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైగా రెడ్డిని దిల్ రాజు కోవిడ్ లాక్ డౌన్ లో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
దిల్ రాజు మొదటి భార్య అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో వైగా రెడ్డి (తేజస్విని)ని పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లికి ముందే దిల్ రాజుకు ఒక కుమార్తె ఉంది. తండ్రికి దగ్గరుండి ఆమెనే పెళ్లి చేసింది. అయితే ఇప్పుడు మరోసారి దిల్ రాజు తండ్రి అవ్వడంతో.. ఆయనకు వంశోద్దారకుడు, వారసుడు లేని లోటు తీరిందని చెప్పుకుంటున్నారు.
ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. ఆ తర్వాత నిర్మాతగా మారి టాలీవుడ్ లో అగ్రనిర్మాతల్లో ఒకరిగా నిలిచిన విషయం విదితమే. ‘దిల్’ సినిమాతో మొదలైన రాజు ప్రస్థానం.. దిల్ రాజుగా ఇప్పటికీ స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. దిల్ రాజు సినిమా అంటేనే ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
ప్రస్తుతం రామ్ చరణ్- శంకర్ కాంబోలో పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్నారు దిల్ రాజు. అదికూడా నిర్మాతగా దిల్ రాజుకు ఇది 50వ సినిమా కావడంతో చాలా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే వంశీ పైడిపల్లి – దళపతి విజయ్ కాంబినేషన్ మూవీని ‘వారసుడు’ అనే టైటిల్ తో అనౌన్స్ చేశారు దిల్ రాజు. ఇప్పుడు అదే టైటిల్ ఈయన ఇంట్లో వినిపించేసరికి ఫ్యాన్స్, సినీ ప్రముఖులు శుభకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Producer Dil Raju was blessed with a baby boy early in the morning today.
— Vamsi Kaka (@vamsikaka) June 29, 2022
A Big Congratulations to the ace producer #DilRaju on being blessed with a baby boy! ❤️
Wishing this lovely couple all the luck and happiness 💕#Tejaswini #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/BSAEli6Jia
— Telugu FilmNagar (@telugufilmnagar) June 29, 2022