కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ తర్వాత ప్రొడ్యూసర్గా మారి అద్భుత చిత్రాలను తెరకెక్కించాడు. ప్రొడ్యూసర్గా ఎన్టీఆర్తో కలిసి ‘బాద్షా’, ‘టెంపర్’ చిత్రాలను నిర్మించాడు బండ్ల గణేష్. ఆ సమయంలోనే ఎన్టీఆర్కు బండ్ల గణేష్కు మధ్య చెడిందని ప్రచారాలు జరిగాయి. రెమ్యునరేషన్ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో పుకార్లు గట్టిగానే వినిపించాయి. ఆ విషయంపై ఇద్దరిలో ఎవరూ స్పందించింది లేదు. మరి, ఆ గొడవలు నిజమా, అబద్ధమా అన్నది క్లారిటీ లేదు. కానీ, ఓ ఇంటర్వ్యూ సందర్భంగా బండ్ల గణేష్ ఆ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేశాడు.
ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ ‘అన్నదమ్ముల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. అది కేవలం మిస్ కమ్యూనికేషనే తప్ప గొడవలు, దూరం అలాంటివేం కాదు’ అని బండ్లన్న కుండ బద్దలు కొట్టేశాడు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న పుకార్లను కొట్టిపారేశాడు. నిర్మాతగా కాస్త బ్రేక్ తీసుకున్న బండ్ల గణేశ్ పవన్ కల్యాణ్తో మూవీ ప్రకటించి తిరిగి ఫామ్లోకి వస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. అంతేకాకుండా హీరోగానూ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.