ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ లోని తన ఫ్లాట్ లో బలవన్మరణానికి పాల్పడింది. ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ లభించినట్లు పోలీసులు తెలిపారు. డిప్రెషన్ కు లోనై.. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆపై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యూషకు మంచి పేరుంది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 30 డిజైనర్లలో ప్రత్యుష ఒక్కరు. శృతి హాసన్, రకుల్ ప్రీతిసింగ్, కృతిశెట్టి, రానా భార్య మిహికా, నిహారికతోపాటు పలువురు సెలబ్రెటీలకు డిజైనర్ గా వ్యవహరించింది. అనేక మంది సెలబ్రిటీలు ప్రత్యూష వర్క్స్ ను ఎండార్స్ చేశారు. సౌత్ ఇండియాలో దాదాపు స్టార్ హీరోయిన్లందరికీ ఈమె డ్రెస్సులు డిజైన్ చేశారు.