ఇటీవల కాలంలో.. సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఫ్యాన్స్ కి ఎప్పుడైతే ప్రెగ్నన్సీ అని గుడ్ న్యూస్ చెబుతారో.. అప్పటినుండి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సీమంతం, బేబీ బంప్ అంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ట్రెండ్ అయిపోయింది. కన్నడలో ‘పోర్కి’ మూవీతో కెరీర్ ఆరంభించి పలు హిట్ చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీకి ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ప్రణీత.
ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంతో తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల్లో అభిమానం సంపాదించుకుంది. గత రెండేళ్లుగా దేశంలో కరోనా కారణంగా ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో ప్రణీత వారికి అండగా నిలిచింది. కర్ణాటకకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రేమ వివాహం చేసుకుంది ప్రణీత.
ఇటీవల తల్లి కాబోతున్న విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అప్పుడప్పుడు తన బేబీ బంప్ ఫొటోలతో కనువిందు చేసింది. నటి ప్రణీత శుభాష్ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తన మనసులోని మాటలు ఆమె తన ట్విట్టర్ వేదికగా తెలిపింది. అయితే ప్రణీత తల్లి ఒక డాక్టర్ కావడంతో తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డెలివరీ చేసినట్లు ప్రణిత తెలిపింది.
ఇది కూడా చదవండి: Dragon Blood Tree: ఇదెక్కడి వింత.. చెట్టు నుంచి రక్తం కారుతోంది.. ఎందుకిలా!
అదే విధంగా తనకు ధైర్యం చెప్పి ఎలాంటి ఇబ్బంది లేకుండా డెలివరీ కావడానికి సహకరించిన వైద్య సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలిపింది. ఇక తమ అభిమాన హీరోయిన్ ప్రణీత తల్లి అయిన సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.