అతడి పేరులో రాజు ఉంది. చూస్తే నిజంగానే రాజసం గుర్తొస్తుంది. ఆరడుగుల కటౌట్ ఉన్నా సరే చాలా సౌమ్యంగా ఉంటాడు. సినిమా షూటింగ్స్ తప్పించి.. మిగతా టైంలో బయట అస్సలు కనిపించడు. ఫ్యాన్స్ అంటే ఇష్టం, తోటీ నటీనటులకు చెప్పలేనంత గౌరవం. అతడి పేరు ప్రభాస్ అయినప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం డార్లింగ్ అని పిలుస్తారు. మొన్నమొన్నటి వరకు ఓ నార్మల్ హీరోగా ఉన్న అతడు.. ‘బాహుబలి’తో తన రేంజ్ పెంచేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. ఇంత స్టార్ అయినప్పటికీ… ప్రముఖ హీరో సూర్య కోసం రాత్రంతా వెయిట్ చేశాడు. ఇప్పుడు ఆ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. డార్లింగ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. తన ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాడు. అలానే తన తోటి నటీనటులకు ఆతిథ్యమిచ్చే విషయంలో అస్సలు తగ్గడు. ప్రభాస్ తోపాటు పనిచేసిన హీరోయిన్లు, నటీనటులు చాలామంది.. డార్లింగ్ పెట్టే భోజనం గురించి ఇన్ స్టాలో ఫొటోలు పెట్టి మరీ షేర్ చేశారు. అయితే ఓ సందర్భంలో మాత్రం తమిళ హీరో సూర్య కోసం గంటల తరబడి వెయిట్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా సూర్యనే బయటపెట్టారు. అయితే ఇది చాలా కాలం క్రితం జరిగింది. అయితే తాజాగా సూర్య, ఓ ఛానెల్ తో మాట్లాడుతూ ఈ మొత్తం విషయాల్ని రివీల్ చేశారు. దీంతో ప్రభాస్-సూర్య.. వాళ్లిద్దరి బాండింగ్ చూసి ముచ్చటపడుతున్నారు.
‘నేను, ప్రభాస్.. హైదరాబాద్ లోని సేమ్ లోకేషన్ లో షూటింగ్ చేశాం. కలిసినప్పుడు.. రాత్రి కలిసి భోజనం చేద్దామని ప్రభాస్ నాతో అన్నాడు. నా కోసం వెయిట్ చేస్తానని చెప్పాడు. అయితే సాయంత్రం 6లోపు అయిపోతుందనుకున్నా నా షూటింగ్ కాస్త రాత్రి 11:30 అయిపోయింది. దీంతో ప్రభాస్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకని.. ఏదైనా హోటల్, ప్రొడక్షన్ మెస్ లో తినేద్దాం అనుకున్నాను. తర్వాతి రోజు ప్రభాస్ ని కలిసి సారీ చెప్పేద్దామనుకున్నా. అయితే నేను షూటింగ్ ముగించుకుని కారిడార్ లో నడుస్తుండగా.. ప్రభాస్ పిలిచాడు. ‘సర్ నేను రెడీ.మీరు స్నానం చేసి వస్తే భోజనం చేద్దాం’ అని అన్నాడు. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. రాత్రి చాలా లేట్ అయిపోయింది కదా.. ఏం వెయిట్ చేస్తారు లే అనుకున్నా కానీ.. తన ఇంటి నుంచి ప్రభాస్ బిర్యానీ తెప్పించాడు. ప్రభాస్ వాళ్ల అమ్మ చేసిన ఆ బిర్యానీ అయితే చాలా బాగుంది.’ అని సూర్య అప్పట్లో జరిగిన విషయాన్ని బయటపెట్టారు.
ఇదేం కొత్త కాదు.. బాహుబలి టైంలో మిగతా యూనిట్ సభ్యులతో పాటు ‘సాహో’ చేస్తున్న టైంలో హీరోయిన్ శ్రద్ధాదాస్, ‘రాధేశ్యామ్’ టైంలో పూజాహెగ్డే, ‘సలార్’ షూటింగ్ లో శ్రుతిహాసన్, ‘ఆదిపురుష్’ టైంలో సైఫ్ అలీ ఖాన్.. ఇలా తోటీనటీనటుల విషయంలో ప్రభాస్ ఆతిథ్యం చాలాసార్లు బయటపడింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ‘సలార్’ షూటింగ్ తో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి వస్తుందనుకున్న ‘ఆదిపురుష్’.. మరో ఆరు నెలల పాటు వాయిదా వేశారు. ఇప్పుడు అది కూడా కాదు.. ఏకంగా 2024 సంక్రాంతికే వస్తుందని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ‘ప్రాజెక్టు k’ షూటింగ్ కూడా ముంబయిలో జరుగుతోంది. ఇక ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్ తో డేటింగ్ లో ఉన్నాడని రూమర్స్ ఫుల్ గా వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కనబెడితే.. సూర్య కోసం ప్రభాస్ రాత్రంతా వెయిట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.