ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు వస్తూనే ఉంటాయి. వాటి గురించి మన సన్నిహితులకు తప్పించి బయటకు వాళ్లకు పెద్దగా తెలియవు. మన బాధని పంచుకోవలన్నా, మనకు ధైర్యం చెప్పి ఓదార్చాలన్నా సరే వాళ్లే ముందుంటారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీల దగ్గర నుంచి ఫ్యాన్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా నివాళులర్పిస్తున్నారు. ఆయన టాలీవుడ్ కి మిగిల్చిన తీపి గుర్తులని నెమరవేసుకుంటున్నారు. ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అనారోగ్య సమస్యలతో సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే హాస్పిటల్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని నానక్ రామ్ గూడలోని ఇంటికి తీసుకొచ్చేశారు. అక్కడే సందర్శనార్థం ఉంచారు. టాలీవుడ్ సెలబ్రిటీల దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంల వరకు ప్రతి ఒక్కరూ కూడా కృష్ణకు నివాళి అర్పించారు. ఈ క్రమంలోనే హీరో ప్రభాస్ కూడా వచ్చాడు. కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపాడు.
ఇకపోతే ప్రభాస్ పెదనాన్న, హీరో, నటుడు కృష్ణంరాజు.. సెప్టెంబరు 11న మరణించారు. అప్పుడు ప్రభాస్ బాధలో ఉంటే మహేశ్ అక్కడి వచ్చి ఓదార్చాడు. ఇప్పుడు మహేశ్ తండ్రి కృష్ణ.. చనిపోవడంతో ప్రభాస్ మహేశ్ ని ఓదార్చాడు. కష్టకాలంలో మహేశ్ కి ప్రభాస్ ధైర్యం చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే కృష్ణ- కృష్ణంరాజు అప్పట్లో కలిసి నటించారు. ఇప్పుడు వాళ్ల వారసులు మహేశ్- ప్రభాస్.. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వీళ్లు ఒకరి కష్టాల్లో మరొకరు తోడుగా నిలబడి ధైర్యం చెప్పుకొంటున్నారు. దీన్ని చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
Prabhas pays his tribute to SSK ❤️#RIPSuperStarKrishnaGaru pic.twitter.com/z27666bcDn
— Radoo (@Ungamma_ra) November 15, 2022
#Prabhas consoles #MaheshBabu @urstrulyMahesh#SSKLivesOn #RIPSuperStarKrishnaGaru #KrishnaGaru pic.twitter.com/fMjTNYR1un
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 15, 2022