పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రొటీన్ కి భిన్నంగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. సాహో లాంటి భారీ యాక్షన్ సినిమా తర్వాత రాధేశ్యామ్ అనే రొమాంటిక్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి యువహీరో నవీన్ పొలిశెట్టి హోస్ట్ గా వ్యవహరించాడు. అయితే.. ప్రభాస్ స్టార్డమ్ గురించి అందరికి తెలిసిందే. ఈ మధ్యకాలంలో రెండు మూడు సినిమాలు తీసిన హీరోలే తమ ఆటిట్యూడ్ చూపిస్తూ.. ఒక్కోసారి కుర్రహీరోలను దగ్గరికి కూడా రానివ్వరు. అలాంటిది పాన్ ఇండియా స్టార్ అయినా ప్రభాస్.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఎక్కడ కూడా తాను స్టార్ అనే హోదాను చూపించకుండా.. అందరిని డార్లింగ్ అంటూ కలిసిపోవడం చూశాం.అలాగే స్టేజి పైన నవీన్ పొలిశెట్టి, ప్రభాస్ భుజం మీద చేతులు వేసి జోక్ చేసినా.. ప్రభాస్ నవ్వుతూ ఆనందించాడు. ఎక్కడ కూడా తానొక పాన్ ఇండియా స్టార్ అనే స్థాయి కనిపించకుండా ఒదిగి ఉండటం విశేషం. అయితే.. నవీన్ భుజం మీద చేతులు వేసినా స్వాగతించడం .. అంటే ఓ కుర్రహీరో తన పై చేతులు వేసి మాట్లాడే స్వేచ్ఛను కల్పించాడంటే అది ప్రభాస్ గొప్పతనం అనే చెప్పాలి.
ఇదంతా ప్రభాస్ లైట్ తీసుకున్నా.. సోషల్ మీడియాలో డార్లింగ్ ఫాన్స్ మాత్రం నవీన్ చేతులు వేయడం పై ఫైర్ అవుతున్నట్లు తెలుస్తుంది. అందుకు సాక్ష్యంగా నెట్టింట ఈ ఫోటో వైరల్ అవుతోంది. మరి ఈ విషయాన్ని ప్రభాస్ లైట్ తీసుకున్నా.. ఫ్యాన్స్ తీసుకోలేదని కామెంట్స్ సోషల్ మీడియా పోస్టులు అర్ధమవుతుంది. మీరు కూడా ఈ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.