ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ.. ఢిల్లీలోని ఎయిమ్స్ లో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత నలభై రోజులుగా స్టార్ కమెడియన్ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. మరి ఆయనకు ఏమైందనే విషయంలోకి వెళ్తే.. ఆగష్టు 10వ తేదీన జిమ్ లో వర్కౌట్ చేస్తున్న శ్రీవాస్తవకు ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. 40 రోజులుగా హాస్పిటల్ లోనే చికిత్స పొందుతూ శ్రీవాస్తవ కన్నుమూశారు. శ్రీవాస్తవ మరణించిన వార్తను స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే ధృవీకరించారు.
దాదాపు నలభై రోజులుగా శ్రీవాస్తవను కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యులు అహర్నిహలు తీవ్రంగా ప్రయత్నించారు. అలాగే దేశవ్యాప్తంగా శ్రీవాస్తవ అభిమానులు సైతం ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కానీ.. వైద్యుల కృషి, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. చివరికి శ్రీవాస్తవ హాస్పిటల్ లోనే కన్నుమూయడంతో ఇండస్ట్రీలో, అభిమానులలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆయన వయసు 58 సంవత్సరాలు. చికిత్స సమయంలో శ్రీవాస్తవ మెదడు పైభాగానికి ఆక్సిజన్ అందలేదని.. అందువల్లే ఆయన మరణించారని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. శ్రీవాస్తవ మృతిపట్ల సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.
Comedian Raju Srivastava passes away in Delhi at the age of 58, confirms his family.
He was admitted to AIIMS Delhi on August 10 after experiencing chest pain & collapsing while working out at the gym.
(File Pic) pic.twitter.com/kJqPvOskb5
— ANI (@ANI) September 21, 2022