హీరో ఆర్య – కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. ఆర్య సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశాడు. ఆర్య తెలుగులో ‘వాడు వీడు, రాజా రాణి, వరుడు, సర్పట్టా’ తనదైన శైలితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఆర్య పై ఒక శ్రీలంకన్ యువతి విద్జా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపణలు చేస్తూ చెన్నై పోలీసులకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసింది. తన దగ్గర 70 లక్షల రూపాయల నగదు కూడా తీసుకున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
హీరో ఆర్యకు 2019 నటి సయ్యేషా సైగల్ తో వివాహం అయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు బిడ్డ కూడా జన్మించింది. రజనీకాంత్ సినిమా షూటింగ్ సమయంలో ఆర్య, సైగల్ తో ప్రేమలో పడి కొన్నేళ్ళ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు. ఆర్యపై ఫిర్యాదు చేసిన విద్జా ప్రస్తుతం జర్మనీలో ఉంటోంది. విద్జా ఆన్లైన్ ఫిర్యాదు వెలుగులోకి రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ఆర్యతో వాట్సాప్ చాటింగ్ సంబంధించిన స్క్రీన్ షాట్ ను పోలీసులకు విద్జా సమర్పించింది. దీనిపై పోలీసులు హీరో ఆర్య కు నోటీసులు జారీ చేయగా చెన్నైలో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడు గంటలపాటు ఆయన్ని పోలీసులు విచారించినట్టు తెలుస్తుంది.