సినిమా అనేది కల్పితం. కొన్నిసార్లు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానూ చిత్రాలు తీస్తుంటారు. కమర్షియల్ మూవీస్ తీసేటప్పుడు పెద్దగా సమస్య ఉండదు గానీ.. మనకు తెలిసిన, విన్న పాత్రలను పెట్టి తీస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రేక్షకుల్లో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా సరే మొదటికే మోసం వచ్చేస్తుంది. తెలుగు సినిమాల విషయంలో ఇలా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలా జరగడంతో స్టార్ హీరోల ఇద్దరిపై కేసు నమోదైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించిన చిత్రం ‘థ్యాంక్ గాడ్’. హీరో సిద్ధార్థ్ కి కారు యాక్సిడెంట్ జరగడంతో పైలోకానికి వెళ్లిపోతాడు. అప్పుడు చిత్రగుప్తుడి వేషంలోని అజయ్ దేవగణ్ దగ్గరికి వెళ్తాడు. అలా వీరిద్దరి మధ్య చాలాసేపు సంభాషణ జరుగుతుంది. ట్రైలర్ అంతా బానే ఉంది కానీ ఇందులోని కొన్ని డైలాగ్స్ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని న్యాయవాది హిమాన్షు శ్రీవాత్సవ.. ఉత్తరప్రదేశ్ ని జాన్ పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హీరోలు అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రాతోపాటు దర్శకుడు ఇంద్రకుమార్ పైనా కేసు పెట్టారు. ‘అజయ్ దేవగణ్ సూటు వేసుకుని, చిత్రగుప్తుడి పాత్రలో అభ్యంతరకర భాషలో జోకులు వేశారు. చిత్రగుప్తుడు అంటే పాపకర్మలు లెక్కించేవారు. దేవుళ్లను అలా చూపిస్తే.. అది మతం మనోభావాలు దెబ్బతీసినట్లే అవుతుంది’ అని హిమాన్షు తన పిటిషన్ లో పేర్కొన్నారు. పిటీషనర్ స్టేట్ మెంట్ ని నవంబరు 18న కోర్టు విచారించనుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్టోబరు 25న థియేటర్లలోకి రానుంది. మరి హీరోలపై కేసు పెట్టడం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: దారుణం: ముంబయిలో తెలుగు నటిపై అత్యాచారం!