పవర్ స్థార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నా 2022 తరువాత పరిస్థితి ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తరువాత పవన్ మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. మరి.. పవన్ తరువాత ఆయన లెగసీ ని ఎవరు కంటిన్యూ చేస్తారు అన్న ప్రశ్న అభిమానులను ఇన్నాళ్లు వేధిస్తూ వచ్చింది. మధ్యలో అకీరా నందన్ పేరు తెరపైకి వచ్చినా రేణుదేశాయ్ ఆ వార్తలను ఖండించారు. దీంతో.. ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. అయితే.., ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ షూట్ లో బిజీగా ఉన్నాడు. దీని తరువాత హరిహర వీరమల్లు మూవీని పట్టాల పైకి తీసుకుని రావాల్సి ఉంది. ఔరంగజేబు కాలం నాటి కథతో దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే.., ఇందులో ఓ కీలక పాత్రలో అకీరా నటించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హరిహర వీరమల్లులో అకీరా పోషించేది చిన్న పాత్రే అయినప్పటికీ.. కొడుకు కోసం పవన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇందుకోసమే అకీరాకు కర్రసాములో శిక్షణ ఇప్పిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతా అనుకుంటున్నట్టు తండ్రితో కలసి అకీరా స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.