పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇటు సినిమాలతో.. అటు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అకీరా చదువుకుంటున్నాడు. వాడి ఇంట్రెస్ట్ ను బట్టి, వాడి కెరీర్ ను సెట్ చేసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చింది తల్లి రేణుదేశాయ్. ఇక అకీరా సోషల్ మీడియాలో కనింపిచడం చాలా తక్కువనే చెప్పాలి. తల్లి రేణుదేశాయ్ తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసే వీడియోలు, ఫోటోల్లో మాత్రమే సందడి చేస్తుంటాడు. ఈ క్రమంలో తన పిల్లల వీడియోను ఒటికి సోషల్ మీడియాలో షేర్ చేసింది రేణుదేశాయ్. దాంట్లో అకీరా లుక్ మెుత్తం మారిపోయింది. గతంలో కాకుండా నూనూగు మీసాలతో ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇద్దామా అన్నట్లు ఉంది ఆ లుక్.
తాజాగా రేణుదేశాయ్ తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. సహజంగానే రేణుదేశాయ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. తన పిల్లలకు, తనకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తన పిల్లలు అకీరా, ఆద్యలు సరదాగా కొట్టుకుంటున్న వీడియోను షేర్ చేసింది. అకీరాకు ఆద్యకు మధ్య కుంగ్ ఫు యుద్దం మెుదలైంది అని రాసుకొచ్చింది. తాజాగా ఓ రెస్టారెంట్ కు వెళ్లిన వెళ్లిన రేణుదేశాయ్ ఈ వీడియోను తీసి షేర్ చేసింది. అయితే ఈ వీడియో లో అకీరా లుక్ పూర్తిగా మారిపోయింది. గతంలో అకీరా ఫోటోలు అన్ని గడ్డం, మీసాలు లేకుండానే మనకు కనిపించాయి.
కానీ ఈ వీడియోలో మాత్రం గడ్డంతో, నూనూగు మీసాలతో స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు అదేంటి అకీరా ఇంతలా మారిపోయాడు. అయితే త్వరలోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఖాయం అన్న మాట అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అదీ కాక హీరో అడివి శేష్ సైతం అకీరా కోసం ఓ కథను సిద్దం చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు సైతం వచ్చాయి. చూడాలి మరి పవన్ కళ్యాణ్ నటవారసుడిగా అకీరా వెండితెర రంగప్రవేశం ఎప్పుడు జరుగుతుందో. ప్రస్తుతం అకీరా నందన్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.