మెగా హీరోల్లో.. మొత్తం టాలీవుడ్లోనే పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ వేరే లెవల్. పవర్ స్టార్ కోసం ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. సినిమాల పరంగా కాకుండా.. వ్యక్తిగతంగా ఆయన చేసే సమాజ సేవ చూసి చాలామంది పవన్కు అభిమానులుగా మారతారు. ఇక పవన్ కళ్యాణ్ గుప్తదానాలు, సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో కూడా చాలా మంది పవన్ ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ సింప్లిసిటీ గురించి ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవన్ సింప్లిసిటీకి నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
నాని, నజ్రియా జంటగా నటించిన అంటే సుందరానికీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఇక పవన్ వస్తుండటంతో.. ఆయన అభిమానులు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. కార్యక్రమం సందర్భంగా పవన్ ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడారు. వారికి తన అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో స్టేజీ మీద ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నటి నివేధా థామస్ గురించి తొలుత ప్రస్తావించలేదు పవన్. చివరకు అందరకు స్టేజీ మీదకు వచ్చినప్పుడు.. మైక్ తీసుకుని ప్రత్యేకంగా ఆమె గురించి ప్రస్తావించారు.
ఇది కూడా చదవండి: Kadambari Kiran: మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల పై కాదంబరి కిరణ్ షాకింగ్ కామెంట్స్!
ఇంతకు ముందు తాను నివేధా థామస్ గురించి చెప్పడం మర్చిపోయానని… అందుకు సారీ అని చెప్పారు. ఆ తర్వాత ఆమె గొప్ప నటి అని పొగిడారు. పవన్ అలా స్టేజీ మీద తనకు సారీ చెప్పేసరికి నివేధా ఒక్క నిమిషం షాక్కు గురయ్యారు. ఇక నివేధా.. పవన్తో కలిసి వకీల్ సాబ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ చేసిన పనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పవన్ కోసం దిగిరావడానికి బాబు సిద్దమయ్యాడా? తెరపైకి 50:50 ఫార్ములా?