ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ‘భీమ్లా నాయక్‘ విజయంతో సంబరాలలో మునిగిపోయారు. సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఏపీలో మాత్రం భీమ్లా నాయక్ విషయంలో ఫ్యాన్స్ నిరాశ చెందినట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి సినిమాపై ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
మొన్నటివరకు ఇండస్ట్రీ వర్గాలతో చర్చలు జరిపి టికెట్ ధరలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. రిలీజ్ సమయానికి అంతా సెట్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేశారు. కానీ భీమ్లా నాయక్ రిలీజ్ తర్వాతే ప్రభుత్వం టికెట్స్ రేట్లు పెంచాలని యోచిస్తోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కనీసం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వమని తేల్చి చెప్పేసరికి చిత్తూరులో పవన్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు.
ఇక మాచర్ల ఏరియాలో పవన్ ఫ్యాన్స్ మరో అడుగు ముందుకేసి ఓ చోట విరాళాలు సేకరించేందుకు డబ్బా ఏర్పాటు చేశారు. ఆ డబ్బా పై ‘భీమ్లా నాయక్’ పోస్టర్ అతికించి.. “సినిమా డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకుండా వారికి మాకు చేతనైన సహకారం కొరకు మాచర్ల పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున విరాళాల సేకరణ” అంటూ పేర్కొన్నారు. ఈ విధంగా ‘భీమ్లా నాయక్’ డిస్ట్రిబ్యూటర్స్ కోసం ఏపీలో పవన్ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ఇక ఫ్యాన్స్ ఇంతగా ఇబ్బంది పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సామాన్య జనాలు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.