క్యారెక్టర్ ఆర్టిస్గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన పవిత్రా లోకేష్ కొంతకాలంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్ను పవిత్రా లోకేష్ వివాహం చేసుకోనున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తలపై సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్ ఇద్దరూ స్పందించి తమదైన వివరణను కూడా ఇచ్చుకున్నారు. తాజాగా పవిత్రా లోకేష్ కర్ణాటక సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
ఆమె పేరుతో సోషల్ మీడియాలో కొందరు ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయటమే కాకుండా, ఆమెకు ఇబ్బంది కలిగించేలా, ఆమె పేరుని చెడగొట్టేలా వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ సైబర్ పోలీసులకు కంప్లైంట్ను ఇచ్చారు. పోలీసులు ఫిర్యాదు తర్వాత ఇన్వెస్టిగేషన్ను స్టార్ట్ చేశారు. సినీ నేపథ్య కుటుంబం కావటంతో ఆ ప్రభావం నుంచే పవిత్ర సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పవిత్రా తండ్రి, ప్రముఖ నటుడు మైసూర్ లోకేష్. భర్త సుచేంద్ర ప్రసాద్, సోదరుడు ఆది లోకేష్ కూడా కన్నడలో మంచి పేరున్న నటులు.
సుచేంద్ర ప్రసాద్ను పెళ్లి చేసుకున్న పవిత్రా లోకేష్ కొన్నేళ్లుగా ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఆ సమయంలో నరేష్తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారిందని, వారు త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. సుచేంద్ర ప్రసాద్ నుంచి అధికారికంగా విడాకులు తీసుకోలేదు. దీంతో ఆమె ఇప్పుడు విడాకులకు అప్లయ్ చేశారని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.