తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో బాలకృష్ణ తర్వాత ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన నటుడు యన్టీఆర్. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యన్టీఆర్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1 చిత్రంతో హీరోగా మారారు. ఈ చిత్రంతో యన్టీఆర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన సుబ్బు పెద్దగా హిట్ కాలేదు. వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీలో యన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించాడు.
ఇటీవల కాలంలో స్టార్ హీరోలు నటించిన చిత్రాలు రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు పోకిరి, పవన్ కళ్యాణ్ నటించిన జల్సా రి-రిలీజ్ అయి భారీ స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి మూవీ కూడా రీ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే బాటలో యన్టీఆర్ నటించిన ‘ఆది’ మూవీ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. యన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ మూడవ వారంలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
ప్రముఖ దర్శకుడు వివివినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ మూవీ స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ నిర్మించారు. ఈ మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆది మూవీకి ప్రసక్తి రావడంతో ఈ చిత్రం కూడా రీ రిలీజ్ ఉంటుందని చెప్పినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. అంతేకాదు ఆది మూవీ భారీ స్థాకిలో ఎక్కువ స్పెషల్ షోలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ చిత్రంతోనే స్టార్ డైరెక్టర్ వివివినాయక్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ మూవీలో యన్టీఆర్ ‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు యన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఈ మూవీ రిలీజ్ అయితే.. మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయం అంటున్నారు సినీ ప్రేమికులు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.