కార్తీకదీపం సీరియల్ అభిమానులకు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర భారీ షాకే ఇచ్చాడు. సీరియల్కు మూల స్థంభాలైన కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు, దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్లను చంపేశాడు. ఇకపై వారి పిల్లలతో కార్తీక దీపం సీరియల్ కొనసాగుతుందని తెలిపాడు. అసలు ఈ ఇద్దరి క్యారెక్టర్లను చంపేశాడు అంటే.. సీరియల్కు ఎండ్కార్డ్ వేయబోతున్నాడేమో అని ప్రేక్షకులు భావించారు. కానీ సీరియల్ కంటిన్యూ అవుతుంది అంటే.. ఈ రెండు క్యారెక్టర్లు తిరిగి వస్తాయనే అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే బతికున్న హిమ క్యారెక్టర్ భవిష్యత్తులో దీపలా మారుతుందని.. ఇక డాక్టర్ బాబు మేనళ్లుల్లో ఎవరో ఒకరు డాక్టర్ కార్తీక్ గా ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వీటిపై డాక్టర్ బాబు క్లారిటీ ఇచ్చారని.. సీరియల్ నుంచి కార్తిక్, దీపల క్యారెక్టర్లను పూర్తిగా తీసేశారని తెలిపినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: నటి సౌందర్యపై డాక్టర్ బాబు షాకింగ్ కామెంట్స్..!
కార్తీకదీపం సీరియల్లో ఇకపై తాను కనిపంచనని.. దీప క్యారెక్టర్ని కూడా ముగించారని నిరుపమ్ పరిటాల తెలిపినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. తరువాతి తరాలతో అంటే హిమ, సౌర్యలపైనే కథ సాగుతుందన్నారట. అంతేకాక తాను ఈ సీరియల్ నుంచి తప్పుకున్నుట్లుగా నిరుపమ్ పరిటాల వెల్లడించినట్లు ఫిల్మ్నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు వాస్తవమే అయితే ఇక ఈ సీరియల్లో నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ తిరిగి వచ్చే చాన్స్ లేదని అర్థం అవుతుంది. మరి కొత్త పాత్రలని జనం చూస్తారా లేదా అనే విషయం తెలియాలంటే టైం పడుతుంది. కార్తీక దీపం సీరియల్ నుంచి వంటలక్క, డాక్టర్ బాబులను తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ముగిసిన కార్తీకదీపం సీరియల్! లాస్ట్ ఎపిసోడ్ పిక్స్ లీక్!