హీరో నిఖిల్ తండ్రి ‘కావలి శ్యామ్ సిద్ధార్థ్’ గురువారం(ఏప్రిల్ 28) కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. తండ్రి మరణంతో నిఖిల్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శ్యామ్ సిద్ధార్థ్ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. శ్యామ్ సిద్దార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
తండ్రి మరణంతో నిఖిల్ ఎమోషనల్ అయ్యారు. తండ్రిపై తనకున్న ప్రేమను చాటుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “తన తండ్రి కార్టికో బేసల్ డీజెనరేషన్ అనే అరుదైన వ్యాధితో గత 8 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారని చెప్పిన నిఖిల్.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లంటే చాలా అభిమానమని అని వెల్లడించారు. తనను కూడా ఏదో ఒకరోజు వెండితెరపై మంచి నటుడిగా చూడాలని తన తండ్రి కలలు కన్నారని, తీరా ఆ కల నెరవేరే సమయానికి ఆయన లేరని ఆవేదన వ్యక్తం చేశారు”.
Devastated that My father Shyam Siddhartha Passed away yesterday.
Hope U find peace wherever you r Daddy..We Love u..
Our RTC Xroad movie and Biryani Outings, Travel,laughter, Summers in Mumbai.. will miss them all.
I am always proud to be Your son. Hope we meet again daddy🙏🏽 pic.twitter.com/vVsJOL6ad1— Nikhil Siddhartha (@actor_Nikhil) April 29, 2022
ఇది కూడా చదవండి: Nikhil Siddartha: బ్రేకింగ్ న్యూస్! హీరో నిఖిల్ ఇంట విషాదం!
“నాన్న.. మీరు ఎక్కడ ఉన్నా శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను. మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాము. మీ గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా కాలం గడవదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ మూవీ, బిర్యానీ ఔటింగ్లు, సుదూర ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్లు, ముంబైలో వేసవి… ఇవన్నీ మిస్ అవుతాము. నేను మీ కుమారుడిగా గర్వపడుతున్నానని చెప్పాలనుకుంటున్నాను. మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను నాన్న” అంటూ నిఖిల్ బరువెక్కిన హృదయంతో ఎమోషనల్ ట్వీట్ చేశారు.
‘హ్యాపీ డేస్’ సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన నిఖిల్ తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం నిఖిల్ 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాల్లో నటిస్తున్నారు. సూపర్ హిట్ మూవీ సీక్వల్ గా కార్తికేయ 2 వస్తుండగా. సుకుమార్ రాసిన ఓ క్రేజీ లవ్ స్టోరీతో కుమారి 21 ఎఫ్ డైరక్టర్ సూర్య ప్రతాప్ డైరక్షన్ లో 18 పేజెస్ సినిమా వస్తుంది.