తాజాగా మెగా డాటర్ నిహారిక భర్తపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అపార్ట్మెంటు వాసులపై కూడా నిహారిక భర్త జొన్నల గడ్డ చైతన్య ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇరువర్గాలను సర్ధిచెప్పి కేసు విత్ డ్రా చేసుకునే దిశగా ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే నిహారక భర్త ఈ కేసుపై జరిగిన విషయాలపై పెదవి విప్పాడు. నేను నా వ్యాపార నిమ్మిత్తం అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నానని తెలిపారు. దీంతో అపార్ట్మెంట్ ఓనర్తో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నానని తెలిపారు. మా వ్యక్తిగత అభిప్రాయాలపై నానా హంగామా చేస్తున్నారని తెలిపారు. ఆఫీస్ పని నిమిత్తం అపార్ట్మెంట్ అద్దెకు తీసుకోవటంతో అందరూ వస్తారని అలాంటిది వారి ఇబ్బంది పెట్టినట్లు ఎలా అవుతుందని చైతన్య తెలిపారు.
దీంతో అపార్ట్మెంట్లోని ఇద్దరు ముగ్గురు కాకుండా ఒకేసారి 20 నుంచి 30 వచ్చారు. దీంతో అలా అందరూ వచ్చి రావటంతోనే నానా హంగామా చేశారు. దీంతోనే వారిపై నేను రిటర్న్గా పోలీసులను ఆశ్రయించానని తెలిపారు చైతన్య. ఇక పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి నచ్చజెప్పారని దీంతో ఎవరికి వాళ్లం కేసును విత్ డ్రా తీసుకున్నామని తెలిపారు. ఇక మీడియా అనవసరంగా నాపై అసత్య ఆరోపణలు చేయోద్దని సూచించారు.