కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహం ఆమె ప్రేమించిన వ్యక్తి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో అంగరంగ వైభవంగా జరిగింది. మహాబలిపురంలోని ఓ రిసార్టులో గురువారం(జూన్ 9న) కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినిమా ఇండస్ట్రీలోని అతిరథమహారధుల సమక్షంలో జరిగింది. నయన్ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు కనిపించి.. అలరించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సూపర్ స్టార్ రజనీ కాంత్ లు ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి హాజరైన సెలెబ్రిటీల ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే శుక్రవారం ఈ నవ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
నూతన దంపుతులు నయనతార, విఘ్నేష్ శివన్లు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఈ ప్రేమికులు.. దంపతులుగా తొలిసారిగా శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ రోజు వీఐపీ దర్శనం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఈ కొత్త జంట ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ నూతన వధువరులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: హైపర్ ఆదిపై యాంకర్ వర్షిణి పోస్ట్ వైరల్.. ‘రైటర్ ఆది.. నువ్వు నాకు రైట్ రా’!