Sai Pallavi: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ మరేవరికి లేదు అన్న సంగతి తెలిసిందే. అభిమానులు ఆమెను ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ కీర్తిస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్ల కోసం ఆమె ఎక్కడికి వచ్చినా.. అభిమానులు భారీ ఎత్తున తరలివస్తుంటారు. ఆమె నటన, డ్యాన్స్ స్కిల్స్ మాత్రమే కాక.. వ్యక్తిత్వం కూడా ఆమెకు అభిమానులును పెంచుతోంది. ఇక ఎక్కడ ఎలాంటి సినిమా కార్యక్రమాలు జరిగినా.. ప్రత్యేక ఇంటర్వ్యూల్లో పాల్గొన్న.. ఎంతో పొదుపుగా, అర్థవంతంగా మాట్లాడుతుంది సాయి పల్లవి.
బాగా ఆలోచించి.. ఆచితూచి మాట్లాడుతూ వివాదాలకు దూరంగా ఉంటుంది. తనకంటూ ఇలా ఓ ప్రత్యేక శైలితో అభిమానులను పెంచుకున్న సాయి పల్లవి.. తొలిసారి వారి ఆగ్రహానికి గురయ్యింది. ప్రస్తుతం నెటిజనులు సాయి పల్లవిని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అంతటితో ఆగక.. ఆమె నటించిన తాజా చిత్రం విరాటపర్వం సినిమాను చూడమని తేల్చి చెప్తున్నారు. మరి ఇంతకు ఈ వివాదానికి కారణం ఏంటో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే..
ప్రస్తుతం సాయి పల్లవి, రానా జంటగా నటించిన మూవీ ‘విరాట పర్వం’ జూన్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా టీం అంతా ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే.. ప్రమోషన్ల కోసం తాజాగా సాయి పల్లవి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విరాట పర్వం సినిమా నక్సల్స్ బ్యాక్గ్రౌండ్లో తెరకెక్కిన సంగతి తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. ఈ మధ్యనే ‘కశ్మీర్ ఫైల్స్’ చూశానని చెప్పి.. ఆ సినిమాలో కశ్మీరి పండింట్లను ఎలా చంపారో చూపించారన్నారు. అదేవిధంగా ఇప్పుడు గోవధ చేస్తున్నారన్నారు. రీసెంట్ గా కోవిడ్ టైంలో.. వ్యాన్ లో ఆవును తీసుకెళ్తున్న ముస్లీం డ్రైవర్ను కొట్టి కొందరు జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి.. ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది? అంటూ సాయి పల్లవి ప్రశ్నించింది.
ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారాయి. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెటజనులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఆమె చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతుందని మండిపడుతున్నారు. అంతే కాదు ఆమె నటించిన విరాట పర్వం సినిమా కూడా చూడమంటూ పోస్టులు పెడుతున్నారు. మరి సాయి పల్లవి దీనిపై ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఇక సినిమా విడుదలకు ముందు ఇలాంటి వివాదం రాజుకోవడంతో సినిమా టీమ్ కూడా టెన్షన్ పడుతుంది. మరి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
After all the balancing & being neutral & good human being talks…. #SaiPallavi ended up comparing Ki11!ngs of innocent #KashmiriPandits with Ki11!ngs of cow smugglers.
What an absolute ldlOT!!! pic.twitter.com/cx9d8jfTNF
— Qazi Mohammad Incognito (@Incognito_qfs) June 14, 2022