నయన్-విఘ్నేష్.. మొన్నటి వరకు ప్రేమజంటగా ఉన్న వీళ్లిద్దరూ ఇటీవల పెళ్లి పేరుతో దంపతులుగా మారిపోయారు. ఎన్నో ఏళ్లుగా ప్రేమ విహారంలో తేలియాడిన ఈ జంట ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి ఆలుమగలుగా మారిపోయారు. దీంతో వీరికి దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోని సినీ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ఇరువురి కుటుంబ సభ్యుల నడుమ జరిగిన వీరి పెళ్లి వేడుక జూన్ 9న మహాబలిపురంలోని పెరటాన్ గ్రాండ్ రిసార్ట్ హోటల్ లో అంగరంగా వైభవంగా జరిగింది.
ఇక మూడు ముళ్లు వేసి మూడు రోజులు కూడా కాకముందే నయన్-విఘ్నేష్ దంపతులు ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. నయన్-విఘ్నేష్ దంపతులు తిరుపతి దేవస్థానం మాడవీధుల్లో చెప్పులు ధరించి నడిచారని, ఇటు సామాన్య ప్రేక్షకుడి నుంచి అటు తిరుపతి దేవస్థాన కమిటీ వరకూ అందరూ మండిపడ్డారు. ఎట్టకేలకు దిగొచ్చిన ఈ నవ దంపతులు తప్పు జరిగిందని, క్షమించాలంటూ వేడుకున్నారు.
ఇది కూడా చదవండి: Nayanthara: పెళ్ళికి నయనతార కట్టుకున్న ఈ చీర స్పెషల్ ఏమిటంటే?ఇక ఇదిలా ఉండగానే కొత్త పెళ్లి కూతురు నయనతారపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. కాగా నయన్ పెళ్లికి రజినీ కాంత్ సహా షారుక్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లకు ఆహ్వానం అందడంతో వారు హాజరయ్యారు. అసలు విషయం ఏంటంటే? వీళ్లతో పాటు మలయాళ హీరో దిలీప్ కుమార్ ని నయనతార పెళ్లికి ఆహ్వానించడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు.
గతంలో నటి భావనను దిలీప్ కుమార్ అండ్ కో లైంగికంగా వేధించారనే ఆరోపణలతో అప్పట్లో ఇతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే నయన్ అతనిని ఎందుకు పిలవాల్సి వచ్చిందంటూ నెట్టింట్లో నయన్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. నయనతారపై నెటిజన్స్ మండిపడడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.