అభిమాన సినీతారలు ఏ సినిమా చేసినా, ఎంత ఆలస్యంగా రిలీజ్ అయినా ఫ్యాన్స్ అలాగే వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే.. ఖచ్చితంగా వాళ్ళ ఫేవరేట్ హీరో/హీరోయిన్ మంచి సినిమాతోనే వస్తారనే నమ్మకం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ లో అలాంటి నమ్మకం ఏర్పరచుకున్న హీరోయిన్ ఎవరంటే.. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి అని చెప్పాలి. ఈ బ్యూటీ తన నటన, అందం, ముఖ్యంగా వినయంతో అందరి మనసులను గెలుచుకుంది. ఇటీవలే ఓ అగ్రదర్శకుడితో లేడీ పవన్ కళ్యాణ్ అని కంప్లిమెంట్ అందుకుంది.
సాయిపల్లవి సినిమా రావడం లేట్ అవ్వొచ్చు. కానీ ఫ్యాన్స్ నిరాశపడే సినిమాలు, తన నటనకు స్కోప్ లేని సినిమాలు మాత్రం చేయదని ఇదివరకే చాలాసార్లు ప్రూవ్ చేసింది. తెలుగులో చివరిగా ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చేసిన సాయి.. త్వరలోనే ‘విరాటపర్వం’ సినిమాతో జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ ప్రారంభించేసారు హీరో రానా, మేకర్స్. తాజాగా జూన్ 5న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు దర్శకుడు వేణు ఊడుగుల.
ఆ పోస్టర్ లో సాయిపల్లవి, రానా గుండెను హత్తుకొని నిలబడి ఉంది. అయితే.. సాయిపల్లవి పూర్తిగా కనిపిస్తుంది కానీ, రానా తలా కనిపించకుండా భుజాల వరకే కనిపించడంతో.. ఓ నెటిజన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘సొంత బ్యానర్ లోనే ఫేస్ కట్ చేసేసారు. ఇంకా బయటివాళ్ళు వేలెత్తి చూపించడంలో తప్పేమి లేదు. వాళ్ళ వీళ్ళ మూవీలో తక్కువ క్యారెక్టర్స్ చేయడం.. లోకువ అవ్వడం రానా స్టైల్” అంటూ రానాను ట్యాగ్ చేశాడు సదరు నెటిజన్. అతని కామెంట్ పై స్పందించిన రానా.. “మనం తగ్గి కథను, హీరోయిన్ని ఎలివేట్ చేయడంలో ఆ కిక్కే వేరు బ్రదర్. సొంత బ్యానర్ కదా.. గొప్ప విషయాలు ఇక్కడే చేయొచ్చు” అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం నెటిజన్ – రానాకూబ్ మధ్య జరిగిన సంభాషణ వైరల్ అవుతోంది. మరి ఈ సంభాషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.