నేడు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన వారు యోగాసనాలు వేస్తు వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రతి సంవత్సరం యోగా డే రోజు ఆసనాలు వేయడం తెలిసిందే. బాలయ్య వేసే యోగసనాలకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి.
హైదరాబాద్ లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రతి ఏటా యోగా దినోత్సవ సందర్బంగా బాలకృష్ణ యోగాసనాలు వేస్తుంటారు. ఈ సారి కూడా ఆయన యోగా డే సందర్భంగా అక్కడికి హాజరయ్యారు. అందరికీ 8 వ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు మనసు ఉల్లాసంగా ఉంటుందని అన్నారు. యావత్ ప్రపంచం మొత్తం మన భారతీయ సాంప్రదాయం అయిన యోగాను గుర్తించడం ఎంతో గర్వకారణం అన్నారు.
ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రదాని నరేంద్ర మోడీ మైసూరులో జరుగుతున్న యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యోగా చేయడం వల్ల సంతోషం, శాంతి తో పాటు మంచి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు. సమాజంలో శాంతిని నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుందన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Today, on International Yoga Day, addlife (Yoga, Naturopathy, Ayurvedha & Gym) wing organized a live event in the presence of our beloved Chairman Sri. Nandamuri Balakrishna & Trust Board Member Sri. J S R Prasad.
Dr. Kalpana Raghunath, Dr. Sumathi & Dr. Uday spoke about (1/3) pic.twitter.com/625kbNlyBZ
— Basavatarakam (@basavatarakam) June 21, 2022