ఏపీలో ఎలక్షన్స్ సమయం ఆసన్నం అవుతుండటంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే టీడీపీ నాయకుడు చంద్రబాబుని కలిసిన పవన్ కళ్యాణ్ త్వరలోనే పొత్తుపై క్లారిటీ ఇస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో యువశక్తి సభను జనవరి 12న నిర్వహించనున్నారు. ఇటీవలే పోస్టర్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్.. యువశక్తి సభలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని జనసేన చీఫ్ పేర్కొన్నారు. ప్రస్తుతం యువశక్తి సభ కోసం రణస్థలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ యువశక్తి సభ ఏర్పాట్లను జనసేన నాయకులతో పాటు దగ్గరుండి చూసుకుంటున్నారు మెగాబ్రదర్ నాగబాబు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నాగబాబు మాట్లాడుతూ.. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ యువతీయువకులు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను షేర్ చేసుకునేందుకు జనసేన మంచి ప్లాట్ ఫామ్ ఇవ్వబోతుంది. ఇన్నాళ్లు యూత్ తమ వాయిస్ ని సోషల్ మీడియా వరకే పరిమితం చేశారు. రేపు వారి కోరికలు, అసంతృప్తి, రాష్ట్రాభివృద్ధి కోసం వారి సూచనలు తెలియబోతున్నాయి.
ప్యాకేజీ అని మాట్లాడేవాడి అమ్మ మొగుడొచ్చి ఇచ్చాడా ప్యాకేజి? అని నేను అడుగుతున్నాను. ఒక్కో సినిమాకి కోట్లు తీసుకునే పవన్ కి ప్యాకేజి అవసరమా? ఎంత దరిద్రమైన ఆలోచనలతో చస్తున్నారు వైసీపీ నాయకులు. మీ తాతలు, బాబులొచ్చి ఇచ్చారా మాకు ప్యాకేజీ? మీలాగా వేలకోట్లు, లక్షల కోట్లు లేవు మా దగ్గర. కానీ.. మాకున్న కొద్దిపాటి డబ్బుని.. రీసోర్స్ ని పదిమందితో పంచుకుంటున్నాం. మీ దగ్గరున్న ఆదాయాన్ని సంపదను కూడా పదిమందితో పంచుకోండి. సన్నాసి మాటలు మాట్లాడొద్దు. అని ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగబాబు. అలాగే రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ అనేవాడు పెద్ద ఎదవ. అలాంటి సన్నాసి, నీచ్ కమీనే గాడు ఇండస్ట్రీలో లేడు. వాడు అవసరం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు కాబట్టి, వాడి గురించి నేను మాట్లాడను” అని విమర్శించారు. ప్రస్తుతం నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరి నాగబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.