టీవీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించే కామెడీ షోలు తెలుగులో బాగానే పుట్టుకొస్తున్నాయి. ఇదివరకు తెలుగులో కామెడీ షోలంటే.. జబర్దస్త్ ఒక్కటే అనుకునేవారు. కానీ ఆ క్రేజ్ చూసి మిగతా ఛానల్స్ లో కూడా కామెడీ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు.. చేస్తున్నారు. జబర్దస్త్ నుండి మెగా బ్రదర్ నాగబాబు వెళ్లిపోయాక మళ్లీ జీ తెలుగు ఛానల్లో ‘అదిరింది’ అనే కామెడీ షోలో జడ్జిగా కనిపించారు.
మరి అదిరింది షోలో ఏమైందో తెలియదుగానీ.. ప్రస్తుతం నాగబాబు స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ‘కామెడీ స్టార్స్ ధమాకా‘ షోలో జడ్జిగా కనిపిస్తున్నారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కామెడీ స్టార్స్ ధమాకా ప్రోగ్రాం ప్రసారం అవుతోంది. అయితే.. ఈ షోకి సంబంధించి లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ప్రోమో చూస్తే.. అంతా సందడిగానే సాగినట్లు అర్ధమవుతుంది. సాధారణంగా సద్దాం, ఎక్సప్రెస్ హరి నాగబాబును గాడ్ ఫాదర్ లా చూస్తారనే సంగతి తెలిసిందే. కానీ ఈసారి నాగబాబు జడ్జిమెంట్ టైంలో హరి కలగజేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ కొత్త ఎపిసోడ్ లో సద్దాం హుస్సేన్, ఎక్సప్రెస్ హరి కలిసి చేసిన స్కిట్ లో.. హరి పెర్ఫార్మర్ గా, సద్దాం జడ్జిగా కనిపించి.. స్కిట్స్ చేసేటప్పుడు జడ్జెస్ ఎలా బిహేవ్ చేస్తారని కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు. వీరి స్కిట్ చూసి నాగబాబు, శేఖర్ మాస్టర్ బాగానే ఎంజాయ్ చేశారు. కానీ చివరిగా ఏమైందో తెలియదు. నాగబాబు మాట్లాడుతూ.. ‘మాములుగా జడ్జెస్ అంటే.. నేను చెప్పేది ఏంటంటే..’ అంటుండగా.. మధ్యలో హరి కలగజేసుకున్నాడు. దానికి నాగబాబు.. ‘ముందు నేను చెప్పేది విను.. నేను మాట్లాడేది ఎందుకంటే’ అంటూ సీరియస్ అయినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. మరి ఈ కామెడీ స్టార్స్ ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.