ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పేరు బాగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న గరికపాటి.. అదే స్టేజ్పై ఉన్న మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. స్టేజ్పై గరికపాటి నరసింహారావు ప్రసంగం ప్రారంభిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో ఫొటోలు దిగుతూ ఉన్నారు. అప్పుడు గరికపాటి చేస్తున్న ప్రసంగంపై ఎవరూ ఆసక్తి చూపకుండా చిరంజీవితో ఫొటోలు దిగడం, దిగుతున్న వారిని చూస్తూ ఉండటం చేశారు. ఆ విషయంలో కాస్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేశారు. “చిరంజీవి గారు మీ ఆ ఫొటో సెషన్ ఆపేసి కాస్త ఇలా వచ్చి కూర్చుంటే నేను ప్రసంగిస్తాను. లేదంటే లేచి వెళ్లిపోతాను నాకు ఎలాంటి మొహమాటం లేదు” అంటూ గరికపాటి వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి, అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవికి ఛేదు అనుభవం అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయంపై మెగా అభిమానులు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అభిమానులు వచ్చి ఫొటోల కోసం ఎగబడితే చిరంజీవి సైతం ఏం చేస్తారు? ఒకవేళ ఫొటోలు ఇవ్వకుండా వెళ్లిపోతే అభిమానులను పట్టించుకోని చిరంజీవి అంటారు కదా అంటూ మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ విషయంపై స్పందించారు. అయితే నేరుగా గరికిపాటిని ఏమనకపోయినా కూడా చేసిన వ్యాఖ్యలు మాత్రం నరసింహారావుకు కౌంటర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి గారు మీ ఫోటో సెషన్ ఆపితే నేను మాట్లాడాలి – ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు#GarikapatiNarasimhaRao #Chiranjeevi #MegastarChiranjeevi #AlaiBalai #Nampally #Hyderabad #NTVTelugu pic.twitter.com/X0Av64Jufj
— NTV Telugu (@NtvTeluguLive) October 6, 2022
అసలు నాగబాబు ఏం ట్వీట్ చేశారంటే.. “ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే” అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అది కచ్చితంగా గరికపాటి వ్యాఖ్యలకు కౌంటర్ అనే చెబుతున్నారు. చిరంజీవి ఇమేజ్ చూసి అసూయతోనే అలా మాట్లాడారు అనే అర్థం వచ్చేలా ఆ ట్వీట్ ఉంది. ఇప్పుడు నాగబాబు చేసిన ట్వీట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. కరెక్ట్ గా చెప్పారు అంటూ మెగా తమ్ముళ్లు ఆ ట్వీట్కు మద్దతు పలుకుతున్నారు. ఇంక అలయ్ బలయ్ కార్యక్రమం విషయానికి వస్తే.. 17 ఏళ్లుగా హరియాణా గవర్నర్ దత్తాత్రేయ అలయ్ బలయ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది మాత్రం ఆయన కుమార్తె విజయలక్ష్మి నిర్వహించారు. ఆ కార్యక్రమంలో దత్తాత్రేయ, వీహెచ్, చిరంజీవి సరదాగా డబ్బులు కొడుతూ అందరినీ ఉత్సాహ పరిచారు.
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే ..
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022