నాగశౌర్య, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్ను విడుదల చేసింది. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ నవ్వులు పూయించే విధంగా టీజర్ను కట్ చేశారు. ఏ అబ్బాయి ప్రేమలో పడని, పడకూడదని గట్టిన నిర్ణయించుకున్న అమ్మాయి రీతు వర్మాని ప్రేమలోకి దించి, పెళ్లాడటమే కథాంశంగా తెలుస్తోంది.
లక్ష్మీ సౌజన్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీశర్మ, నదియా, కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్లో థియేటర్లలో సందడి చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.