బాలీవుడ్ నటి, శ్రీలంక అందాలభామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ముంబయి ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ మధ్య సినిమాలతో కంటే ఓ కేటుగాడితో రిలేషన్షిప్ వల్ల వార్తల్లో నిలుస్తోంది. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న ఈ మోసగాడు సుకేష్ చంద్రశేఖర్తో సంబంధం ఉన్నట్లు పుకార్లు బయటికి రావడంతో ఈ అమ్మడికి కష్టాలు మొదలయ్యాయి. ఇటీవలే ఆ మోసగాడితో ఈ భామ కలిసి ఉన్న ఫోటో బయటికి రావడంతో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఆమెపై ఈడీ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేయడమే అందుకు కారణం. దాంతో దేశం విడిచి వెళ్లకుండా ఆమెను నిలువరించారు.
సుకేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల రూపాయల బహుమతులు పొందిందని సమాచారం. అందులో రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ కారుతో పాటు దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో సుఖేశ్… జాక్వెలిన్ పేరు కూడా వెల్లడించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాక్వెలిన్ కు సమన్లు జారీ చేసింది.
ఈడీ విచారణకు హాజరైన జాక్వెలిన్ పై కొన్నాళ్ల కిందట లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల కాలంలో ఆమె పలు పర్యాయాలు ఈడీ విచారణకు గైర్హాజరైనట్టు తెలుస్తోంది. తాజాగా ముంబయి ఎయిర్ పోర్టుకు వచ్చిన జాక్వెలిన్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమెను అడ్డుకున్న సిబ్బంది లుకౌట్ నోటీసులు విషయం వివరించి ఆమెను తిప్పి పంపారు. కాగా, జాక్వెలిన్ ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా ‘బచ్చన్ పాండే’, ‘రామ్ సేతు’ వంటి సినిమాలో నటిస్తుంది.
Actor Jacqueline Fernandez was stopped at the Mumbai Airport by immigration officials due to a LOC (Look Out Circular) in connection with a Rs 200 crore extortion case involving conman Sukesh. She was supposed to fly to Muscat: Sources
— ANI (@ANI) December 5, 2021