సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా హీరోలకు సమానంగా.. హీరోయిన్లకు రెమ్యూనరేషన్ లు ఇవ్వరు. ఈ విషయంపై గతంలో చాలా సార్లు.. చాలా మంది విమర్శలు చేశారు. తాజాగా మరోసారి హీరోయిన్లు పారితోషికానికి సంబంధించిన విషయం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. హీరోయిన్ల పారితోషికంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్లకు ఎంత రెమ్యూనరేషన్ కావాలో డిమాండ్ చేసే విషయంలో వారు అస్సలు మెుహమాటపడకూదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మృణాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
మృణాల్ ఠాకూర్.. హిందీ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం వెండితెరపై అవకాశాలు రావడంతో సినిమాల్లో నటిస్తూ.. బిజీగా మారింది. ఈ క్రమంలోనే హనురాఘవ పూడి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ కావ్యం ‘సీతారామం’ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా పిప్పా అనే బాలీవుడ్ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తుంది మృణాల్. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన ఈ అమ్మడు.. హీరోయిన్ల రెమ్యూనరేషన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ..”ప్రస్తుతం హీరోయిన్లు తమ పారితోషికం చెప్పడానికి భయపడుతున్నారు. ఇలాంటి ధోరణి ఇండస్ట్రీలో మారాలి. అదీకాక హీరోయిన్లు తమ క్రేజ్ ను బట్టి రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేయాలి. కానీ చాలా మంది నటీమణులు పారితోషికం డిమాండ్ చేసే విషయంలో అయోమయానికి గురవుతుంటారని” మృణాల్ చెప్పుకొచ్చింది. హీరోయిన్లు ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటీని బట్టి తమ రెమ్యూనరేషన్ ను తామే నిర్ణయించుకోవాలని సూచించింది మృణాల్. అలా నిర్ణయించుకున్నప్పుడే మనం వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో తెలుస్తుందని మృణాల్ ఠాకూర్ పేర్కొంది. చాలా మంది హీరోయిన్లు పారితోషికాన్ని డిమాండ్ చేయడానికి భయపడతారని ఈ సందర్భంగా గుర్తు చేసింది సీతారామం హీరోయిన్. ప్రస్తుతం మృణాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.