మీ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్, బిగ్ స్క్రీన్ పై కనిపిస్తే ఏం చేస్తారు. విజిల్స్ వేసి గోల గోల చేస్తారు. కానీ దీనికి భిన్నంగా.. ఈ మధ్య కాలంలో ఓ ఇద్దరు క్యారెక్టర్స్ ఆర్టిస్టులు తెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు అరిచి గోల చేస్తున్నారు. ఇప్పటికే అర్థమైందనుకుంటా.. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. వాళ్లే నరేశ్-పవిత్రా లోకేష్. మొన్నటి వరకు ఈ జంట.. సినిమాల్లో మాత్రమే కనిపించేవారు. కానీ రీసెంట్ టైంలో బయట కూడా కలిసే కనిపిస్తున్నారు. వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నటుడు నరేశ్ గురించి తెలుగు సినిమాలు చూసేవాళ్లకు తెలుసు. హీరో, హీరోయిన్లకు అమ్మ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న పవిత్రా లోకేష్ కూడా చాలామందికి పరిచయమే. అయితే కొన్నాళ్ల క్రితం మైసూరులోని ఓ హోటల్ లో నరేశ్-పవిత్రా లోకేష్ జంటగా కనిపించారు. నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి వీరిపై కేకలు వేసింది. దీంతో నరేశ్-రమ్య మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ వివాదం ద్వారానే.. నరేశ్-పవిత్ర వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ బయటకూడా జంటగా కనిపిస్తూ వచ్చారు. రీసెంట్ గా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల్లోనూ నరేశ్-పవిత్ర కనిపించారు. అయితే వీరిద్దరికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
తమపై వస్తున్న పలు రూమర్స్ కు చెక్ పెట్టాలని నరేశ్-పవిత్రా లోకేష్ భావిస్తున్నారట. అందులో భాగంగానే ఓ ప్రేమకథా చిత్రాన్ని తీసి, తన రియల్ లైఫ్ రిలేషన్ ని సినిమాగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి కాస్త ఫిక్షన్ కూడా జోడించబోతున్నట్లు సమాచారం. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో నరేశ్-పవిత్ర ఫేస్ చేసిన సవాళ్లతో కూడిన ఓ స్టోరీ రెడీ చేసినట్లు టాక్. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలతో పాటు మరిన్ని విషయాలు రివీల్ చేయనున్నారట. ఇప్పటివరకు పలు సినిమాల్లో భార్యాభర్తలుగా నటించిన నరేశ్-పవిత్ర.. ఇప్పుడు తొలిసారి హీరోహీరోయిన్ గా కనిపించనున్నారు అనేసరికి ఇంట్రెస్టింగ్ గా మారింది.
నరేశ్-పవిత్రా లోకేష్ లైఫ్ లో ఏం జరిగింది? వీళ్లిద్దరూ ఎలా కలిశారు? ఎందుకు కలిసి ఉంటున్నారు? అనే విషయాల్ని ఈ సినిమా స్పష్టంగా చెప్పబోతున్నారట. తమ బంధంపై ఈ చిత్రంతో క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇదిలా ఉండగా నరేశ్-పవిత్రా లోకేష్ జంటగా నటించిన ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా ఇటీవలే ఓటీటీలో రిలీజైంది. ఇందులో వీరి కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులు ఫుల్ గా ఎంటర్ టైన్ అయ్యారు. మరి నరేశ్-పవిత్రా లోకేష్ బయోపిక్ అని వస్తున్న రూమర్స్ పై మీ అభిప్రాయం ఏంటి.. కామెంట్స్ లో పోస్ట్ చేయండి.