తెలుగు సీరియల్స్ చూసేవారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే రోజూ కనిపిస్తుంది కాబట్టి. ప్రస్తుతం ‘కల్యాణం కమనీయం’ సీరియల్ చేస్తున్న ఈమె.. అంతకు ముందు కూడా పలు సీరియల్స్ లో యాక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లోనూ ఓ మనిషిలా కలిసిపోయింది. అయితే ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన వీడియో మాత్రం.. నెటిజన్లకు షాకిచ్చింది. ఇక ఆమె ఫ్రెండ్స్ అయితే తెగ కంగారుపడిపోయారు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు విషయం బయటకొచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బుల్లితెర నటీనటులు అంటే ఒకప్పుడు సీరియల్స్, షోల్లో మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సీరియల్స్ యాక్టింగ్ చేస్తూ.. మరోవైపు సొంత యూట్యూబ్ ఛానెల్స్ రన్స్ చేస్తున్నారు. మిలియన్ల కొద్ది వ్యూస్ కూడా సంపాదిస్తున్నారు. అయితే రోజూ కంటెంట్ దొరకడం అంటే ఎవరికైనా సరే చాలా కష్టం. అందులో భాగంగానే కొన్నిసార్లు థంబ్ నెయిల్స్ తో షాకిచ్చేలా కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మేఘనా కూడా సేమ్ అలాంటిదే చేసింది. ఈ క్రమంలోనే కొందరు ఆమె ట్రోల్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం నవ్వుకుంటున్నారు.
ఇక సీరియల్ షూటింగ్స్ తో ఎప్పుడూ బిజీగా ఉండే మేఘనా.. తాజాగా ఓ రోజు ఖాళీగా ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. ఆ టైంలో భర్త కూడా ఆఫీస్ కి వెళ్లిపోవడంతో ఫ్రెండ్స్ కి ప్రాంక్ కాల్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. అందులో భాగంగా కో యాక్టర్స్ కొందరికి కాల్ చేసింది. వాళ్లలో కొందరు కాల్ బిజీ రాగా, మరికొందరు కనెక్ట్ కాలేదు. ఫైనల్లీ మేఘన ఫ్రెండ్, యాక్టర్ స్వర్ణ.. రిట్నర్ కాల్ చేశారు. ఈ క్రమంలో మేఘనా.. ‘ఇంట్లో ఎవరూ లేరు. నీరసంగా అనిపిస్తోంది. చచ్చిపోతానేమో’ అని అమాయకంగా మాట్లాడింది. దీంతో అవతలవైపు ఉన్న తెగ కంగారు పడిపోయింది. ఇప్పుడు వచ్చేస్తా.. కాల్ కట్ చేయొద్దని భయపడిపోయింది. చివర్లో.. ఇది ప్రాంక్ అని మేఘన చెప్పడంతో ఆమె రిలాక్స్ అయిపోయింది. మరి ఇలాంటి వీడియోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.