మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. అటు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇటు చిరంజీవి కూడా ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన కిక్లో ఉన్నారు. సినిమా సూపర్ సక్సెస్ కావడంపై సక్సెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నారు. సినిమా బృందానికి, సల్మాన్ ఖాన్కు, సినిమాని ఆదరించిన అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సినిమా అన్నింటా ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రమోషన్స్ విషయంలోనూ బిస్లెరీతో ఒప్పందం చేసుకుని గాడ్ ఫాదర్ లిమిటెడ్ ఎడిషన్ కూడా తీసుకొచ్చారు. ఈ సినిమా రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.69.12 కోట్ల గ్రాస్, రూ.35 కోట్ల షేర్ని రాబట్టింది. ఈ వీకెండ్తో గాడ్ఫాదర్ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమనిపిస్తోంది.
ఇంక చిరంజీవికి సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ వార్త టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారంలో ఉంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి మరో మలయాళ రీమేక్లో నటించబోతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ సినిమాకి కూడా రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఆ మలయాళ సూపర్హిట్ సినిమాకి సంబంధించిన రీమేక్ రైట్స్ కూడా రామ్ చరణ్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే మెగాస్టార్ మరో మలయాళ సూపర్ హిట్ సినిమాలో కనిపించనున్నారని చెప్పాల్సిందే. అది కూడా ఎంతో వపర్ ఫుల్ క్యారెక్టర్, సూపర్ స్టోరీ సినిమాగా చెబుతున్నారు.
Another 600 screens added for #GodFather in Hindi 💥💥
Megastar @KChiruTweets thanks the audience for giving the HUMONGOUS BLOCKBUSTER 💥
–https://t.co/qO2RT7dqmM#BlockbusterGodfather 🔥@BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @ActorSatyaDev pic.twitter.com/R04HA1nm2c
— Konidela Pro Company (@KonidelaPro) October 8, 2022
ఆ సినిమా ఏదంటే.. మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన మమ్మూటీ నటించిన భీష్మపర్వం. ఇప్పుడు ఆ సినిమా రైట్స్ ని రామ్ చరణ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఆ సినిమాకి చిరంజీవి ఓకే చెబితే మెగాస్టార్ చిరంజీవిని ఒక మాస్ డాన్ క్యారెక్టర్ లో ప్రేక్షకులు చూడబోతున్నారు. మమ్మూటీ స్టైల్, లుక్స్, స్వాగ్ అంతా మెగాస్టార్కు కచ్చితంగా సెట్ అయ్యేలాగే ఉన్నాయి కూడా. ఈ సినిమాలో అనసూయ మమ్మూటి గర్ల్ ఫ్రెండ్ గా నటించింది. ఈ రీమేక్ పక్కా అయితే గాడ్ ఫాదర్ రేంజ్లో మెగా ఫ్యాన్స్ కు చిరంజీవి నుంచి మరో మాస్ మూవీ వచ్చినట్లే. ప్రస్తుతానికి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య, మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాల్లో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల తర్వాత చిరంజీవి భీష్మపర్వం సినిమాలో నటిస్తారని చెబుతున్నారు. అయితే దర్శకత్వ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది.