ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొన్న వారు ఎవరైనా ఉన్నారంటే.. జంబలకిడి జారు మిఠాయి సాంగ్ పాడిన సింగర్ భారతమ్మ. మంచు విష్ణు జిన్నా మూవీలోని జారు మిఠాయి సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఈ క్రమంలో ఈ పాట పాడిన ఒరిజనల్ సింగర్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్బాబు.. స్వయంగా ఈ పాట ఒరిజనల్ సింగర్ భారతమ్మని పరిచయం చేయడమే కాక.. స్టేజి మీదకు పిలిచి.. ఆవిడ మా ఊరి నుంచి వచ్చారు.. పాడ పాడతారు అని పరిచయం చేశాడు. ఇక భారతమ్మ పాడిన ఒరిజనల్ పాట సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ట్రోల్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు.
లిరిక్స్ , వాయిస్ బాగున్నాయని కొందరు… సన్నీ లియోన్ సాంగ్ అని ఇంకొందరు.. ఇదేం పాట తల్లి.. ఆ పదాలు ఏంటి.. వాటి అర్థం ఏంటి అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఏది ఎలా ఉన్నా.. ఈ పాట పుణ్యమా సదరు పాట పాడిన భారతమ్మకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జంబలకిడి జారు మిఠాయి పాట పాడిన భారతమ్మను మంచు మనోజ్ కలిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది.