ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం హీరోయిన్ పూర్ణ నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మరికొద్ది రోజుల్లో హీరోయిన్ నయనతార-విఘ్నేష్ శివన్ల వివాహం జరగబోతున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ పెళ్లి వార్తలు నెట్టింట వైరలవుతోన్నాయి. ఇప్పటికే సదరు నటి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇంతకు ఎవరా నటి అంటే.. ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించిన ‘మనసంతా నువ్వే’ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది.
ఈ చిత్రంలో చంద్రమోహన్, సునీల్, తను రాయ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సుహాని ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. 31 ఏళ్ల సుహాని పలు చిత్రాల్లో నటించింది. మోడలింగ్ రంగంలో రాణించింది. ప్రస్తుతం ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోంది. నిశ్చితార్థం కూడా అయిపోయింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. మ్యుజీషియన్, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో సుహాని నిశ్చితార్థం జరిగింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Manchu Lakshmi: రకుల్ ప్రీత్ సింగ్- మంచు లక్ష్మీ మాస్ డాన్స్.. వీడియో వైరల్!
‘బాల రామాయణం’ చిత్రంతో సుహాని సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. గణేష్, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించింది. అదే సమయంలోనే తెలుగు సహా తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడ కూడా సినిమాలు చేసింది. ఆ తర్వాత పలు కంపెనీల యాడ్స్లోనూ తళుక్కున మెరిసింది. 2008లో సవాల్ సినిమాతో హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ కథానాయికగా తనకు పెద్ద గుర్తింపు రాలేదు.
ఇది కూడా చదవండి: Nandamuri Taraka Ratna: Jr.NTR తో విబేధాలపై స్పందించిన తారకరత్న! ఫ్యామిలీ అంతా కలిసి..!
చివరి సారిగా 2010లో ‘స్నేహగీతం’ చిత్రంలో ఆమె నటించింది. ఆ తర్వాత ఆమె ఏ చిత్రాల్లో కూడా నటించలేదు. ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కబోతున్న సుహానికి అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Adivi Sesh: పవన్ కొడుకు అకిరాతో అడవి శేష్ మల్టీస్టారర్..!