Major: 26/11
ఈ డేట్.. ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రదాడికి మాత్రమే కాదు. ఒక దేశ సైనికుడి ధైర్యాన్ని కూడా గుర్తుంచుకునే రోజు. ముంబైలో నవంబర్ 26, 2008న కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్ టార్గెట్గా జరిగిన ఉగ్రదాడిలో వందేళ్ల పూర్వనుంచి ఉన్న తాజ్ హోటల్ కూడా టార్గెట్ అయింది. ఆ రాత్రి వారి ప్లాన్ ప్రకారం పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు అనుకున్నట్లే ముంబైకి చేరుకుని రెండు వేరు వేరు దారుల్లో వెళ్లారు. సీఎస్టీ రైల్వే స్టేషన్, యూపోల్డ్ కేఫ్, ఒక పెట్రోల్ బంకు, వాళ్లు ఎక్కిన రెండు టాక్సీలలో బాంబులు పెట్టడం వంటివి చేస్తూ ఓబెరాయ్ ట్రైడెంట్ హోటల్, తాజ్ హోటల్కు వెళ్లారు.
తాజ్ హోటల్ ఎటాక్ చేయబడ్డ తర్వాత.. ముందుగా నావీ కమాండోస్ టీం ‘‘మార్కోస్’’ వారిని ఎదుర్కోవటానికి తాజ్ హోటల్లోకి వెళ్లింది. ఒక పెద్ద బాంబు పేలుడు తాజ్ హోటల్లోని పై ఫ్లోర్లో జరిగింది. అనుకోకుండా వచ్చిపడ్డ టెర్రరిస్ట్ అటాక్ను అడ్డుకోవటానికి, హోటల్లో బంధింప బడ్డ వారిని కాపాడ్డానికి ఓ స్పెషల్ ఆపరేషన్ చేపట్టాల్సిందే అని, ఢిల్లీనుంచి 51ఎస్ఐజీ స్పెషల్ యాక్షన్ గ్రూప్ ఎన్ఎస్జీ కమాండోస్ తక్షణ ఆపరేషన్కోసం ముంబైకి చేరుకున్నారు. ఎదురు దాడికి ఎన్ఎస్జీ సిద్ధంగా ఉంది. ఆ టీంను లీడ్ చేస్తూ ఓ ఉన్నత స్థాయి కమాండో ఆఫసర్ ముందుకు వెళ్తున్నారు. ఆపరేషన్ బ్లాక్ టోర్నడో మొదలైంది.
27 నవంబర్ 2008ఆఫరేషన్ బ్లాక్ టోర్నడో మేజర్ సందీప్ ఉన్నీ క్రిష్ణన్ స్పెషల్ యాక్షన్ గ్రూపుకు టీం కమాండర్. మేజర్ సందీప్, సునీల్ జోదా, మనోజ్ కుమార్, బాబులాల్తో కలిపి మొత్తం పది మంది సభ్యుల టీం ఆలస్యం చేయకుండా హోటల్లోకి ఎంటర్ అయింది. తాజ్ బిల్డింగ్ మధ్యలో Y ఆకారంలో ఉన్న మెట్ల ద్వారాపైకి వెళుతున్నారు. ఎక్కే ప్రతి మెట్టు చావు వైపే అని ఆ టీం సభ్యులకు తెలుసు. కానీ, ఎవరికీ ఆ భయం లేదు. శత్రువుల్ని చంపటం కన్నా.. బంధీల్ని కాపాడాలన్నదే వారి ఆలోచన. వారు వెళుతున్న మెట్ల దారి మొత్తం చీకటిగా ఉంది. బాంబు దాడుల కారణంగా హోటల్లో ఎగసి పడుతున్న మంటల్ని ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది వేల లీటర్ల నీటిని చల్లటంతో లోపల ఫ్లోర్ల నిండా నీళ్లు నిండాయి.
మెట్ల గుండా కిందకు రాసాగాయి. చీకట్లో.. నీళ్లతో నిండిన మెట్లపై వాళ్లు వేస్తున్న అడుగుల చప్పుళ్లు మరింత టెర్రర్ని పెంచసాగాయి. కమాండోస్ ప్రతీరూము జల్లెడ పడుతూ లోపల ఉన్నవారిని కాపాడుతూ వెళుతున్నారు. అలా ఆరో ఫ్లోర్లోకి వెళ్లారు. అక్కడ ఓ రూములో టెర్రరిస్టులో ఎంతో మంది ఆడవారిని లాక్ చేసి బంధించారు. ఆ రూం బద్దలు కొట్టి లోపల ఉన్నవారిని బయటకు తీసుకురావాలి. కమాండోస్ డోర్ను బద్దలు కొట్టి, తలుపులు తెరిచారు. అయితే, ఊహకందని విధంగా లోపల నుంచి టెర్రరిస్టులు ఫైరింగ్ మొదలుపెట్టారు. టెర్రరిస్టుల ఏకే47లనుంచి బుల్లెట్ల వర్షం కురుస్తోంది. మేజర్ సందీప్ సునీల్ జోదా, బాబులాల్ను ఎడమ వైపు ఫామ్ లాంజ్కు దారి తీసే బ్రౌన్ డోర్ల వైపు వెళ్లమని సైగ చేశాడు.కానీ, అక్కడ కూడా టెర్రరిస్టులు ఉండొచ్చని భావించి, ఓ గ్రెనేడ్తో రూట్ను క్లియర్ చేద్దామనుకున్నారు. ఇద్దరు కమాండోస్ డోర్కు ఇరువైపులా నిల్చున్నారు. అంతలోనే ఓ గ్రెనేడ్ వారిపైపు వచ్చి పడింది. గ్రెనేడ్ పేలుడుకు కమాండోస్ చెల్లాచెదురయ్యారు. పై ఫ్లోర్లో ఉన్న టెర్రరిస్టులు ఎప్పటినుంచో కమాండోల కదలికలను గమనిస్తూ ఉన్నారు. సరైన సమయం చూసుకుని దాడి చేశారు. కొద్దిసేపటి తర్వాత ఇంకో గ్రెనైడ్ వచ్చి అక్కడ పడింది. టెర్రరిస్టులు ఆపకుండా ఫైరింగ్ చేయటం మొదలుపెట్టారు. దీంతో సునీల్ జోదాకు బుల్లెట్లు తగిలాయి. ఆయన ఛాతిలోకి రెండు బుల్లెట్లతో పాటు పేలిన గ్రెనైడ్ ముక్కలు కూడా గుచ్చుకున్నాయి. గాయాల కారణంగా ఆయన స్ప్రహ తప్పిపడిపోయాడు. కమాండోలు చీకట్లో దాక్కున్న టెర్రరిస్ట్పై కాల్పులు జరుపుతూ ఉన్నారు.
సునీల్ కాపాడేందుకు బాబులాల్తో అతడ్ని ఫస్ట్ ఏయిడ్ కోసం వెనక్కు తీసుకెళ్లాలని చెప్పాడు. ఆ ఇద్దరినీ సేఫ్ ప్లేసుకు తీసుకెళ్లటానికి రక్షణ ఇస్తు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ కుడి చెయ్యికి బుల్లెట్ తగిలింది. ఆయనప్పటికి వెనక్కు తగ్గకుండా ఫాం లాంజ్వైపు వచ్చారు. తర్వాత సందీప్ ఒక్కడే ఫాం లాంజ్ వైపు తప్పించుకుంటున్న టెర్రరిస్టులను వెంబడించారు. కారిడార్లో నడుస్తూ ఉన్నారు. అప్పుడే ఓ వెలుతురు వచ్చింది. తర్వాత ఒకేసారి రెండు శబ్ధాలు ఒకటి ఎకే47 నుంచి మరోకటి ఎంపీ5నుంచి. అప్పుడే కల్నల్ షరన్ వాకీ టాకీతో వారికి మెసేజ్ చేశారు. ఈ బ్లాక్ టోర్నోడో మొత్తాన్ని లీడ్ చేస్తున్న అధికారి ఆయన. ఆయన చేసిన మెసేజ్కు రిప్లై రాలేదు. టెర్రరిస్టుల దగ్గర ఉండటం వల్ల రిప్లై రాలేదు అనుకున్నారు.
నవంబర్ 28, శుక్రవారంఉదయం సమయంలో మేజర్ కందువాల్ టీం 21 ఫ్లోర్లను అన్నింటిని క్లియర్ చేసింది. నాలుగు గంటల తర్వాత హోటల్లోని అన్ని రూముల్లోని బంధీలకు విముక్తి లబించింది. ఇక, ఉగ్రవాదుల కోసం వేట మొదలైంది. కానీ, అదే సమయంలో మేజర్ సందీప్ కూడా ఎక్కడున్నారో తెలియలేదు. సందీప్ను వెతుక్కుంటూ షరన్ నాలుగులో ఫ్లోర్ వరకు వెళ్లారు. మరింత బాగా వెతికేందుకు రెండు టీంలను రంగంలోకి దింపారు. మేజర్ ఫోన్కు కాల్ చేశారు. స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆయన తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంటారని అనుకున్నారు.
ఉదయం 9 గంటల సమయంలో మేజర్ కంద్వాల్ మేజర్ ఉన్నీ క్రిష్ణన్ అడుగులను అతడి షూ మార్క్స్ ఆధారంగా కనిపెట్టారు. తన రైఫిల్ను గురిపెట్టి, ఆ అడుగుల్ని ఫాలో అవుతూ వెళ్లారు. అక్క ఓ నేలపై ఓ నల్లని ఆకారం పడి కనిపించింది. కంద్వాల్ ముందుకు వెళ్లి చూసి షాక్ అయ్యారు. అక్కడ చనిపోయి ఉన్నది మేజర్ సందీప్ అని తెలిసి కంట నీరు గారింది. సందీప్ శరీరంలోకి దిగిన బుల్లెట్లు మొత్తం ఎడమ వైపు నుంచి కాల్చబడ్డాయి. రెండు అడుగుల దూరంలో వాకీ టాకీ పడిఉంది. గ్రెనైడ్ పిన్ ఆయన చేతికి ఉంది. టెర్రరిస్ట్ ఆల్కోవ్లో ఉన్న ఓ విగ్రహం వెనుక దాక్కొని, సందీప్ అతడ్ని దాటి వెళ్లగానే వెనుకనుంచి కాల్పులు జరిపాడు.సందీప్ నేల కూలగానే కారిడార్ వైపు పరుగులు తీశాడు. కానీ, మేజర్ పోరాడకుండా ప్రాణాలు విడవలేదు. టెర్రరిస్ట్పై ఆపకుండా కాల్పులు జరిపాడు. ఓ భారతీయ సైనికుడిలా ముందు నుంచి యుధ్దం చేసి తుది శ్వాస విడిచారు. తన కర్తవ్య నిర్వహణలో భాగంగా మొత్తం 12 మందిని కాపాడారు. సందీప్ మరణానం అందరికీ తెలియకూడదని కంద్వాల్ భావించాడు. వాకీటాకీతో కాకుండా ఫోన్తో షరాన్కు ఫోన్ చేశాడు. ‘‘ సర్! ఉన్నీ ఈజ్ నోమోర్’’ అని చెప్పాడు. సందీప్ మరణం తర్వాత కమాండోలు మరింత యాక్టీవ్ అయ్యారు.
పగడ్భందీగా ముందుకు వెళ్లసాగారు. సందీప్ వెంటాడటం వల్ల ఉగ్రవాదులు హోటల్ నార్త్ ఎండ్ వైపు పారిపోయారు. ఎన్ఎస్జీ టీం వారిని తుదముట్టించింది. పోరాటంలో ప్రాణాలు విడవటానికి ముందు ఆయన ఆఖరిగా అన్న మాటలు ధైర్యసాహాసాలకు గుర్తుగా నిలిచాయి. ‘‘ డోంట్ కమ్ అప్.. ఐ విల్ హ్యాండిల్ దెమ్’’ మీరు ఎవరూ పైకి రావద్దు.. నేను వాళ్లను చూసుకుంటా’’ అని అన్నారు. 26/11 దాడులు ప్రజలకు గుర్తున్నంతకాలం ఆయన ధైర్య సాహసాలు అందరీకి గుర్తుంటాయి. మరి, శత్రువుల దొంగదాడిలో దేశం కోసం ప్రాణాలు విడిచిన మేజర్ సందీప్ ఉన్నీ క్రిష్ణన్ ధైర్య సాహసాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Lokesh Kanagaraj: అప్పుడు ఖైదీ.. మధ్యలో మాస్టర్.. ఇప్పుడు విక్రమ్! లోకేశ్ కనగరాజ్ అంతా…