సూపర్ స్టార్ కృష్ణ.. ఒక స్టార్ హీరోగా, స్టార్ ప్రొడ్యూసర్గా కృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమాన గణం ఉంది. ఆయన మరణవార్తతో రెండు తెలుగు రాష్ట్రాలు శోకసంధ్రంలో మునిగిపోయాయి. ఒక్క సినిమా ఇండస్ట్రీనే కాకుండా రాజకీయ ప్రముఖులు సైతం ఆయన పార్థివదేహానికి నివాళులర్పించేందుకు నానక్రామ్గూడ చేరుకుంటున్నారు. సినిమా తారలు మాత్రమే కాకుండా.. చంద్రబాబు, కేసీఆర్ వంటి రాజకీయ ప్రముఖులు సైతం నివాళులు అర్పించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత కృష్ణ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తమ అభిమాన హీరో ఇకలేరనే వార్త విని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒకే ఏడాదిలో ముగ్గురు సభ్యులను కోల్పోయిన మహేశ్ బాబు కుటుంబం సైతం తీవ్ర మనోవేదనకు లోనవుతోంది. గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ద్వారానే కృష్ణ మరణించినట్లు ఇప్పటికే కాంటినెంటల్ ఆస్పత్రివారు స్పష్టం చేశారు. తమ అభిమాన హీరో ఇంకా కొన్ని రోజులు బతికుంటే బాగుండేది అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు మహేశ్ బాబు కుటుంబం కూడా అదే బాధను అనుభవిస్తోంది. అయితే ఎక్మో పద్ధతిని ఉపయోగించి కృష్ణను కాపాడునే అవకాశం ఉన్నా.. మహేశ్, కుటుంబ సభ్యులు ఆ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఎందుకు అలా చేశారు అనే అనుమానం చాలా మందికి రావచ్చు. అయితే ఆ విధానం గురించి పూర్తిగా తెలుసుకుంటే వాళ్లు సరైన నిర్ణయమే తీసుకున్నారు అని మీరూ అనుకుంటారు.
ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియాలి అంటే ముందుగా అసలు ఎక్మో అంటే ఏంటో తెలుసుకోవాలి. ECMO అంటే ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజెనేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే.. కృత్రిమంగా శరీరానికి ఆక్సిజన్ని అందించడం. దీనిద్వారా శరీరంలో ఉన్న రక్తాన్ని కృత్రిమంగా శుద్ధిచేసి.. శరీరంలోని కార్బన్ డయాక్సైడ్ని బయకు తీసి.. అవయవాలకు ఆక్సిజన్ని అందిస్తారు. ఈ ప్రక్రియ వల్ల గుండె, ఊపిరితిత్తులపై పని భారం తగ్గుతుంది. వాటికి కాస్త విశ్రాంతి లభిస్తుంది. ఈ ఎక్మోలో VA ECMO, VV ECMO అని రెండు విధానాలు ఉంటాయి. వీఏ ఎక్మో విధానంలో సిర- ధమని రెండిటిని ఎక్మో మెషిన్కి అనుసంధానం చేస్తారు. గుండె- ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే వీఏ ఎక్మో విధానాన్ని ఉపయోగిస్తారు.
ఇంక వీవీ ఎక్మో విధానంలో ఒకటి కంటే ఎక్కువ ధమనులు, సిరలను ఎక్మో మెషిన్కు అనుసంధానం చేస్తారు. కేవలం ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నప్పుడు మాత్రమే ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. ఈ ఎక్మో విధానం ద్వారా మల్టీ ఆర్గాన్ ఫెయిల్ అయినా మనిషి బతికే ఉండేలా చేయచ్చు. గుండె శస్త్రచికిత్స, హార్ట్ ఫెయిల్యూర్ నుంచి కోలుకుంటున్న వారు, ఊపిరితిత్తుల ఫెయిల్యూర్ నుంచి కోలుకుంటున్న వారికి ఈ ఎక్మోని సజెస్ట్ చేస్తారు. ఈ విధానాన్ని ఉపయోగించి మనిషి ప్రాణాలు కాపుడుతూ.. చికిత్సను కొనసాగిస్తారు. ఈ విధానం ద్వారానే కృష్ణను కాపాడుకునే అవకాశం ఉండేది. అయితే ఈ విధానం అంత తేలికైనది కాదు. దీనిని చేసే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అలాగే ఈ విధానానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
Superstar Krishna Garu expired in early hours of morning at 4:09 AM Today.
Continental Hospitals Medical Report #RIPSuperStarKrishnaGaru pic.twitter.com/CjLlXRyTRN
— BA Raju’s Team (@baraju_SuperHit) November 15, 2022
ఈ విధానాన్ని అమలు చేయాలి అంటే మనిషి ముందు కాస్త శారీరకంగా ధృడంగా ఉంటే చికిత్సను తట్టుకోగలరు. అలాగే ఈ విధానాన్ని చేసే క్రమంలో.. రక్తం గడ్డకట్టకుండా మెషిన్లోకి వెళ్లడానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు. వాటి వల్ల బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంటుంది. మెషిన్కి ఉండే ట్యూబ్స్ ని ఎక్కడ అయితే శరీరానికి కనెక్ట్ చేస్తారో.. అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మెషిన్ ట్యూబ్స్లో రక్తం గడ్డ కట్టడం, ట్యూబ్లలో గాలి చేరటం జరుగుతుంది. అలాగే ఈ విధానం ద్వారా మళ్లీ హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనిషిని ప్రాణాలతో ఉంచగలరే తప్ప.. తిరిగి ఆయన కోలుకుంటారు, సాధారణస్థితికి వచ్చే అవకాశం కూడా లేదు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి చూస్తే.. ఎక్మో చికిత్సను తట్టుకోగలరనే నమ్మకం కడా లేదు.
Mahesh and family took decision not to give any further support like ECMO and let him die peacefully without any pain though they can afford any kind of supportive treatment which can delay the death.. That’s a brave call..Really shows the love they have for krishna garu…
— Rev (@Drpulmo) November 15, 2022
ఏడు పదులు వయసు, కుమారుడు, భార్యలను కోల్పోయి మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో కృష్ణ ఈ ఎక్మో ట్రీట్మెంట్ని చేయించుకోగలరా? చేయించుకుని తిరిగి కోలుకోగలరా? ఇలాంటి ఆఖరి నిమిషాల్లో ఆయనను మరింత ఇబ్బంది పెట్టడం అవసరమా? అలాంటి ప్రశ్నలనే మహేశ్, కుటుంబ సభ్యులు వైద్యులను అడిగినట్లు తెలుస్తోంది. అందుకు వైద్యులు సైతం కోలుగోగలరు అనే నమ్మకాన్ని ఇవ్వలేకపోయారని సమాచారం. మరి.. ఆఖరి నిమిషాల్లో ఆయనను శారీరకంగా అంత బాధ పెట్టడం అవసరమా? అనే ప్రశ్ను వారికి వారు వేసుకున్నారని తెలుస్తోంది. ఆయనకు ప్రశాంతమైన మరణాన్ని అందిచాలనే ఎక్మో వద్దని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు, ఆయన కుటుంబం తీసుకున్న ఈ ధైర్యవంతమైన నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఎంతో ధైర్యం ఉంటేనే అలాంటి నిర్ణయం తీసుకోగలరు అంటూ కామెంట్ చేస్తున్నారు.