తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల ఘట్టమనేని ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారు.. తర్వాత మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ నెల 15న సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన మద్య లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు కుటుంబ సభ్యులే కాదు.. అభిమానుల గుండెలు కూడా బరువెక్కిపోతుంది. నవంబర్ 27 ఆదివారం.. కృష్ణ దినకర్మ.. శాస్త్రోక్తంగా నేడు అన్ని కార్యక్రమాలు హైదరాబాద్లోని జేఆర్సీ, ఎన్ కన్వెన్షన్స్లో పూర్తిచేశారు ఘట్టమనేని కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖలతో పాటు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు.
సూసర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభిమానులను ఉద్దేశించి మహేష్ బాబు తన తండ్రి కృష్ణను గుర్తు చేసుకొని ఎంతో ఎమోషన్ అయ్యారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘నాన్న నాకు ఎన్నో ఇచ్చారు.. ఆయనకు నా జన్మంతా రుణపడి ఉంటా.. ఆయన కొడుకుగా పుట్టడం నా అదృష్ణం.. మీ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను.. నాన్న ఎప్పుడూ నా గుండెల్లోనే కాదు అభిమానుల గుండెల్లో కూడా ఎప్పటికీ ఉండిపోతారు.. ఆయన ఎప్పుడూ మన మద్యనే ఉంటారు.. మీ అభిమానం, ఆశిస్సులు నా కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను..’ అంటూ ఎంతో ఎమోషన్ కి గురయ్యాడు.
హైదరాబాద్ జేఆర్సీ కన్వేన్షన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దాదాపు ఐదు వేల మందికి పాసులు పంపిణీ చేసినట్లు తెలుస్తుంది.. అలాగే 32 రకాల వంటకాలతో విందు ఏర్పాట్లు చేశారు. అంతేకాదు పెద్ద కర్మ కార్యక్రమం సందర్భంగా కృష్ణ విగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఎంతో ఎమోషన్ కి గురయ్యారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, హీరో సుదీర్ బాబు స్టేజ్ పైనే బోరున ఏడ్చేశారు.. ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన అల్లుడిగానే పుట్టాలని భగవంతుడిని కోరుకుంటున్నా అంటూ ఎమోషన్ అయ్యారు. తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఘట్టమనేని ఫ్యామిలీ కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్న సెలబ్రెటీలు, అభిమానుల హృదయాలను కదిలించింది.