Padamati Sandhya Ragam: తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్న టాలీవుడ్ స్టార్ కిడ్స్లో మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు మహేష్. తర్వాతి కాలంలో సూపర్ స్టార్గా మారారు. భారీ హిట్లతో ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇక, మహేష్ బాబు కుటుంబం విషయానికి వస్తే.. ఆయనకు ఓ కొడుకు గౌతమ్, కూతురు సితారా ఉన్నారు. ఇద్దరూ కూడా తండ్రి నట వారసత్వాన్ని కొనసాగించేలా కనిపిస్తున్నారు. గౌతమ్ వన్ నేనొక్కడినే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో బాల నటుడిగా చేశారు. సితార ‘సర్కారు వారి పాట’ పెన్నీ ప్రమోషనల్ సాంగ్తో అదరగొట్టింది.
తాజాగా, సితార తండ్రితో కలిసి ఓ సీరియల్ ప్రమోషన్ వీడియోలో మెరిసింది. త్వరలో ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారం కాబోతున్న ‘‘పడమటి సంధ్యారాగం’’ సీరియల్ కాన్సెప్ట్ ప్రోమోలో తండ్రీకూతుళ్లిద్దరూ కనిపించారు. ‘‘ఇండియాకు, అమెరికాకు మధ్య దూరం వేల మైళ్లు కావచ్చు. రెండింటిని దగ్గర చేసేది అనుబంధం మాత్రమే’’ అంటూ సీరియల్ కాన్సెప్ట్ చెప్పారు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మహేష్ అన్న తో ప్రమోట్ చేయిస్తే ఏదైనా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది’’..
‘‘ ఈ షో కి మహేష్ బాబు గారు మరియు సితార రావడం చాలా ఆనందంగా ఉంది’’ .. ‘‘ అసలు చరిత్ర లో నే మొదటిసారి ఇది. మహేష్ అన్న ఒక టీవీ సీరియల్ కి సపోర్ట్ ఇవ్వటం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు అయితే ఆనందంతో గెంతులేసినంత పనిచేస్తున్నారు. మరి, మహేష్, సితారలు ప్రమోట్ చేస్తున్న ఈ ‘‘పడమటి సంధ్యారాగం’’ సీరియల్ కాన్సెప్ట్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vijay Devarakonda, JGM: ‘జనగణమన’ గురించి మర్చిపోండి.. విజయ్ దేవరకొండ క్లారిటీ