మా ఎలక్షన్స్!!.
హేమ రేపిన దుమారం…
రిటార్ట్ ఇచ్చిన నరేశ్..
ముందు ముందు ఎన్ని మలుపులో..?‘
మా’ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని నరేష్ అన్నారు. మా నిధులను దుర్వినియోగం చేశారంటూ హేమ చేసిన ఆరోపణలను నరేష్, జీవిత తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. హేమ ఆరోపణలపై నరేష్, జీవిత వివరణ ఇచ్చారు. ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు నరేష్. కరోనా టైంలో ఎలక్షన్స్ నిర్వహించ కూడదని పలు హై కోర్టులు, సుప్రీం కోర్టు చెప్పిందన్నారు నరేష్.
హేమ చేసిన వ్యాఖ్యలపై నరేశ్ తో పాటు జీవితా రాజశేఖర్ స్పందించారు. మీడియా కి వెళ్ళ కుండా సమస్యలను పరిష్కరించుకుందామనే నియమం వుంది. కానీ మీడియా ముందుకు రాక తప్పటం లేదు అని జీవిత అన్నారు. హేమ ఆరోపణల కు వివరణ ఇవ్వకపోతే ఆ ఆరోపణలు నిజం అనుకొనే ప్రమాదం వుంది. హేమ మాటలు చాలా తప్పుగా అనిపించాయని జీవిత అన్నారు. హేమ చేసిన ఆరోపణలను నరేశ్ ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
మా సభ్యులను తికమక పెట్టేలా వ్యాఖ్యలు చేయకూడదని జీవిత హితవు పలికారు. సభ్యులు వారికి ఇష్టం వచ్చిన వారికి ఓట్లు వేస్తారని, వారికి ఆ స్వేచ్ఛ ఉంటుందని ఆమె అన్నారు. మా కు శాశ్వత భవనం ఏర్పాటు అనే నినాదంతో ఐదుగురు సభ్యులు ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.