విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాకు వచ్చిన హైప్ ఓ రేంజ్ లో ఉంటే.. రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. ఇంకా చెప్పాలంటే ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఈ చిత్రానికి మైనస్ అయ్యాయనే చెప్పాలి. ఇలా పాన్ ఇండియా లెవల్లో రచ్చ చేస్తుందనుకున్న లైగర్ కాస్తా.. ఏ భాషలోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబోలో చేస్తున్న మరో మూవీపై లైగర్ ఎఫెక్ట్ పడినట్లు కనిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మాస్ ఆడియెన్స్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. కానీ కరోనా వల్ల ఆ మూవీ కాస్త ఇన్నేళ్లకు రిలీజైంది. పూరీ సినిమాలంటే.. హీరోలకు ఓ రేంజ్ లో ఎలివేషన్, డైలాగ్స్ ఉంటాయి. కానీ ‘లైగర్’ విషయంలో అది మిస్సయింది. దీంతో అటు పూరీ ఫ్యాన్స్, ఇటు విజయ్ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు.
ఇకపోతే వీరి కాంబోలో తీసిన లైగర్ సెట్స్ పై ఉండగానే.. JGM అనే మూవీ ప్రారంభించేశారు. ఆల్రెడీ ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు. లైగర్ హిట్ అయ్యుంటే ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా పెరిగేవేమో. కానీ లైగర్ రిజల్ట్ తేడా కొట్టేసింది. దీంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘JGM’విషయంలో పూరీ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. లైగర్ రిజల్ట్ ఎఫెక్ట్ వల్ల స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దేశభక్తి- ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో ఉండే ఈ స్టోరీని.. మహేశ్ బాబుతో తీయాలని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అనుకున్నారు. కానీ సూపర్ స్టార్ తో సెట్ అయ్యేలా కనిపించక పోవడంతో విజయ్ తో ప్లాన్ చేశారు. సెట్స్ పైకి కూడా తీసుకెళ్లారు. సో ఇప్పుడు పూరీ మార్పులు చేయడం అనే న్యూస్… JGM చిత్రానికి హెల్ప్ అయితే సరేసరి. లేదంటే విజయ్-పూరీ వరస ప్లాఫ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి.. పూరీ డ్రీమ్ ప్రాజెక్టు JGM స్క్రిప్ట్ లో మార్పులు అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చూడండి: 60 ఏళ్లు వచ్చినా.. ఆ 20 రోజులు మరిచిపోలేను: విజయ్ దేవరకొండ