బన్నీ అలియాస్ అల్లు అర్జున్.. మొన్నటి వరకు తెలుగుకే పరిమితమైన ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తెలుగు సినిమాని రాజమౌళి ఓ రేంజ్ కి తీసుకెళ్లి నిలబెడితే.. అల్లు అర్జున్ దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఇక దేశవిదేశాల్లోనూ బన్నీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అతడిని అభిమానిస్తున్నారు. ‘పుష్ప’ సినిమాని రష్యాలోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగానే టీమ్ అంతా.. ఆ దేశానికి వెళ్లారు. ఇదే టైంలో ఓ ప్రముఖ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇప్పుడవే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గానూ మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీవీ షోల్లో ‘అలీతో సరదాగా’ టాక్ షోకి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న టాక్ షోల్లో చాలావరకు ప్రెజెంట్ జనరేషన్ నటీనటులనే తీసుకొస్తున్నారు. వారి గురించి మాట్లాడుతూ అభిమానుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. కానీ ‘అలీతో సరదాగా’లో మాత్రం ఒకప్పటి టాలీవుడ్ యాక్టర్స్ ని వెతికి పట్టుకొచ్చి మరీ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈసారి అలనాటి హీరోయిన్ ఎల్. విజయలక్ష్మిని గెస్ట్ గా తీసుకొచ్చారు. హోస్ట్ అలీ.. ఆమెతో అప్పటి విషయాలు మాట్లాడాడు.ఎన్టీఆర్ తనని కోడలా అని ముద్దుగా పిలిచేవారని, ఆయన నటించిన ‘గుండమ్మ కథ’లో తనతో ఒక్క పాటైనా సరే చేయించాలని కేవలం మ్యూజిక్ తోనే సాంగ్ పెట్టించారని ఆమె చెప్పుకొచ్చింది.
ప్రముఖ హీరోయిన్, నర్తకి అయిన ఎల్.విజయలక్ష్మి.. అప్పటి తరానికి ఆరాధ్య నటి. స్టార్ హీరోలు ఆమెతో డ్యాన్స్ చేయడానికి తెగ ఆరాటపడేవారు. ఇక పెళ్లి తర్వాత అమెరికాలో సెటిలైన ఆమె.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ షో కోసం మన దేశానికి తిరిగొచ్చారు. తనకు సాంగ్ వినిపిస్తే చాలు.. ఆటోమేటిక్ గా మూమెంట్ వచ్చేస్తుంది చెప్పుకొచ్చింది. ఇక ఈ జనరేషన్ హీరోలు చేసిన సినిమాలు ఏమైనా చూశారా అని అలీ అడగ్గా.. ‘పుష్ప’ చూశానని విజయలక్ష్మి చెప్పింది. అందులో యాక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా? అనగానే.. తెలియదు అని చెప్పింది. అలీ చెబుతూ.. అతడు అల్లు రామలింగయ్య గారి మనవడు అని చెప్పాడు. ఈ మధ్య కాలంలో యంగ్ హీరోల గురించి అడుగుతుంటే.. అందరూ ఎన్టీఆర్ మనవడు, రామానాయుడు మనవడు అని చెబుతున్నారని ఎల్. విజయలక్ష్మి చెప్పింది. ఇలా ఇంట్రెస్టింగ్ విషయాలతో ఉన్న ఈ ప్రోమో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.