దివంగత నటులు రెబెర్ స్టార్ కృష్ణంరాజు ఈ నెల 11వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయన స్వగ్రామమైన మొగల్తూరులో సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ సెలబ్రిటీలతో పాటు.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు లక్ష మంది వరకు ప్రభాస్, కృష్ణంరాజు అభిమానులు హాజరయ్యారు. వీరందరికి ప్రభాస్ కుటుంబం కడుపు నిండా భోజనం పెట్టి పంపాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చూడడానికి వచ్చేవారికి సుమారు 50 రకాల వంటకాలతో భారీ విందును ఏర్పాటు చేశారు. అందుకోసం ప్రభాస్ కోట్లు ఖర్చు చేశారు.
సుమారు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ కుటుంబ సభ్యులతో కలసి మొగల్తూరు విచ్చేయడంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ప్రభాస్ ఇంటి వద్దకు భారీగా చేరుకొన్న అభిమానులు.. ‘రెబల్ స్టార్.. రెబల్ స్టార్..’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు మీద అభిమానంతో.. తమను చూడటాని వస్తున్న జనాలను సాధరంగా ఆహ్వానించిన ప్రభాస్ వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టి పంపారు. అందుకోసం 50 రకాల వంటకాలతో లక్ష మందికి సరిపోయేలా భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ వంటకాల కోసం ప్రభాస్ రూ.4 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
All fans, police personnel, everyone is sitting & eating calmly !
.#Prabhas management for Samsamarna Sabha 👌#KrishnamRajuLivesOn pic.twitter.com/09wweKAoRJ— Raju Garu Prabhas 🏹 (@pubzudarlingye) September 29, 2022
50 రకాల వంటకాలతో ఉన్న ఫుడ్ మెనూ సోషల్ మీడియాలో వైరలయిన సంగతి తెలిసిందే. 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు , 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 4 టన్నుల సందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు.. ఇవి కాక మరో 22 రకాల నాన్ వెజ్ వంటకాలు, మరెన్నో వెజ్ వంటకాలు. ఇవి కృష్ణంరాజు సంస్మరణ సభలో వచ్చిన అతిధులకు వడ్డించిన ఆహారం. కాగా, కృష్ణంరాజు అంతిమ సంస్కారాలకు సంబంధించి తరలివచ్చిన అభిమానులకు కూడా ప్రభాస్ అంత వేదనలో ఉండి కూడా భోజనాలు ఏర్పాటు చేసిన తెలిసిందే.
ఇదీ చదవండి: కృష్ణంరాజు స్మృతివనం కోసం 2 ఎకరాల స్థలం కేటాయించిన ఏపీ ప్రభుత్వం..