మెగాఫ్యామిలీ కోడలు, స్టార్ హీరో రాంచరణ్ సతీమణి కొణిదెల ఉపాసన.. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సామాజిక అంశాల పై స్పందిస్తూ.. హెల్త్ తో పాటు కుటుంబ విషయాలు కూడా షేర్ చేస్తుంటారు. అటు మెగాకోడలిగా ఇంటి బాధ్యతలను.. ఇటు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు రెండింటిని బ్యాలన్స్ చేస్తున్నారు.
అంతేగాక తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ తనకు తెలిసిన చిట్కాలతో ఫ్యాన్స్ కి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఉపాసన. అయితే.. తాజాగా ఇండియన్ ఎక్స్పో- 2020(Dubai)లో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఉపాసన సమావేశమయ్యారు. అలాగే మోడీతో సమావేశమైన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆమె పోస్ట్ లో.. “ఇండియన్ ఎక్స్పో- 2020 సందర్బంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నాను. ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత మెరుగుపర్చడం, మహిళా సాధికారత, సంస్కృతి పరిరక్షణ మీద దృష్టిసారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతికత శక్తి మనకు ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది. మనం వాటిని తెలివిగా, సమర్థంగా ఉపయోగించుకోవాలి’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మెగా కోడలి పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.
It was an absolute honour to meet 📸 @PMOIndia ji at the @IndiaExpo2020
It was amazing to see innovation, preventive healthcare, women empowerment & preservation of culture to be the main focusThe power of technology gives us opportunity,we must use it wisely@expo2020dubai pic.twitter.com/EYYwRVK2Qv
— Upasana Konidela (@upasanakonidela) December 22, 2021