ఇండస్ట్రీలో కొన్నిసార్లు అవకాశాలు వచ్చినట్టే వచ్చి.. చివరి నిమిషంలో చేజారిపోవడం జరుగుతుంటాయి. అది నటీనటుల విషయంలో లేదా దర్శకుడు, టెక్నీషియన్స్ ఇలా ఎవరి విషయంలోనైనా జరగవచ్చు. సినిమాల పరంగా కొన్ని కాంబినేషన్స్ ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ ఒకటి కొన్నేళ్ల క్రితమే మిస్ అయ్యిందని.. దర్శకుడే చెబితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం క్రాక్, వీరసింహారెడ్డి సినిమాల విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని.. వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన కెరీర్ కి సంబంధించి విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ సాలిడ్ సినిమా రీమేక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మిస్ అయ్యిందని చెప్పి షాకిచ్చాడు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రెజెంట్ బాలయ్యతో తీసిన వీరసింహారెడ్డి మూవీ మంచి సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. కలెక్షన్స్ పరంగానూ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. అయితే.. వీరసింహారెడ్డి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్న గోపీచంద్ మలినేని.. తారక్ తో రెండుసార్లు సినిమా ఛాన్సులు మిస్ అయ్యాయని చెప్పాడు. తారక్ తో ఎప్పుడు ఛాన్స్ ఎప్పుడు మిస్ అయ్యిందని అడగ్గా.. దళపతి విజయ్ చేసిన ‘కత్తి’ మూవీని నేను తెలుగులో తారక్ తో రీమేక్ చేయాలి. ఫస్ట్ ఆ ప్రపోజల్ వచ్చిందని అన్నాడు.
అదే విషయంపై మాట్లాడుతూ.. “కత్తి సినిమా రీమేక్ నేను తారక్ తో చేయాలని మురుగుదాస్ ప్రపోజల్ పెట్టారు. దాని గురించి తారక్ తో కూడా మాట్లాడారు. ఓవైపు రీమేక్ చర్చలు జరుగుతుండగా.. మరోవైపు తమిళ నిర్మాతలు, చిరంజీవి గారు రీమేక్ రైట్స్ ఓకే చేసుకున్నారు. ఇక్కడే మరో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కత్తిని నేరుగా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేద్దామని హీరో విజయ్ ఆపారు. అలా ఆ సినిమా ఛాన్స్ నాకు మిస్ అయ్యింది. ఆ తర్వాత తారక్ తో నా కాంబినేషన్ లో దిల్ రాజు ఓ సినిమా ప్లాన్ చేశారు. అప్పుడే నేను తారక్ కి ఓ కథ చెప్పాను. ఆ కథ చాలా హెవీ యాక్షన్ తో ఉందని, నీ నుండి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని తారక్ అన్నారు. అలా రెండో ఛాన్స్ మిస్ అయ్యింది’’ అని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు. మరి గోపీచంద్ – తారక్ ల కాంబినేషన్ ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Sketch & Planning by Boss 👏👌 pic.twitter.com/LuDOSFiShL
— Hanu ™ (@HanuNews) January 22, 2023