ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలిచి.. రికార్డు సృష్టించింది. తెలుగు చిత్రం ఆస్కార్ సాధించినందుకు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ కొందరు మాత్రం ఆస్కార్ ప్రమోషన్స్కు భారీగా ఖర్చు చేశారంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఆర్ఆర్ఆర్ ప్రొడ్యుసర్ కార్తికేయ. ఆ వివరాలు..
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు సాధించిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చింది. దాంతో తెలుగు చిత్రం ఖ్యాతి.. ప్రపంచవ్యాప్తమైంది. అయితే ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ రావడానికి ముందు పెద్ద వివాదం నడిచింది. ఆస్కార్ ప్రమోషన్స్కి భారీగా ఖర్చు చేశారంటూ.. టాలీవుడ్లో కొందరు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మరీ ముఖ్యంగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఏకంగా ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, అంతటి డబ్బు పెడితే ఎనిమిది సినిమాలు తీసి ముఖాన కొడతా అంటూ వ్యంగంగా స్పందించిన తీరు పెను దుమారం రేపింది. ఆ తర్వాత దీనిపై నాగబాబు, దర్శకులు కె రాఘవేంద్రరావులు స్పందించడంతో ఈ వివాదం మరింత పెరిగింది.
ఇక ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్లు ఖర్చు చేశారని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పగా.. మరి కొందరైతే ఏకంగా 100 కోట్లు సంపాదించారు. కాగా ఈ విషయంపై తాజాగా రాజమౌళి తనయుడు, ఆర్ఆర్ఆర్ లైన్ ప్రొడ్యూసర్ కార్తికేయ స్పందించారు. ఆస్కార్ ప్రమోషన్స్ వాస్తవ ఖర్చులను ఆయన వెల్లడించారు. తాజాగా ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్య్వూలో కార్తికేయ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్కి వెళ్లిన తీరు, అయిన ఖర్చు గురించి వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ సినిమాపై విదేశీయులు ఎక్కువ ఆసక్తి చూపించారట.
ఓటీటీలో వచ్చినప్పటికీ థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపించారని, అందుకే అమెరికాలో రిలీజ్ చేయాలనుకున్నామని వెల్లడించాడు కార్తికేయ. అందుకే కేవలం ఒక రోజు మాత్రమే అరవై స్క్రీన్లలో షో వేయాలనుకున్నాం. కానీ ఒక్క రోజు అనుకుంటే నెల రోజులు గడిచిపోయింది. సినిమా చూశాక ఏం నచ్చిందని అడిగితే, చరణ్ని తారక్ ఎత్తుకుని చేసే ఫైట్ బాగా నచ్చిందన్నారు. పాటలు వస్తుంటే లేచి డాన్సులు చేశారని చెప్పుకొచ్చాడు కార్తికేయ.
ఆస్కార్ ఈవెంట్కి వెళ్లడంపై కార్తికేయ స్పందిస్తూ.. ‘‘ఈవెంట్లో పాల్గొనడానికి కీరవాణి, చంద్రబోస్, ఎన్టీఆర్, రామ్చరణ్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, కాలభైరవలకు మాత్రమే అకాడమీ ఆహ్వానం. నామినీలకు, స్టేజీపై పర్మామ్ చేసేవాళ్లను మాత్రమే అకాడమీ కమిటీ ఆహ్వానిస్తుంది. సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్లకి టికెట్ కొనాల్సిందే. ఇందుకోసం నామినేషన్స్లో ఉన్న వాళ్లు కమిటీకి ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. కీరవాణి, చంద్రబోస్ మా కోసం మెయిల్ చేశారు. అది చూసి వాళ్లు టికెట్ బుక్ చేసుకునేందుకు లింక్ పంపారు. ఆ టికెట్లలో రకరకాల క్లాసులుంటాయి. లోయల్ లెవల్ సీట్లు ఒక్కొక్క దాని కోసం 1500 డాలర్లు (సుమారు లక్షల ఇరవై వేలకుపైనే) ధర ఉంటుంది. టాప్లో కూర్చొని చూసేందుకు మా కుటుంబంలోని నలుగురికి 750 డాలర్లు పెట్టి టికెట్లు తీసుకున్నాం’’ అని తెలిపారు కార్తికేయ.
అలానే ఆస్కార్ అవార్డును కొన్నారంటూ వస్తోన్న విమర్శలపై కూడా ఆయన స్పందించారు. ‘‘ఆస్కార్ కొనడమనేది పెద్ద జోక్ అని.. 95ఏళ్ల చరిత్ర కలిగిన ఇనిస్టిట్యూట్ అది .. అక్కడ ప్రతిదానికీ ఓ పద్ధతి ఉంటుందని తెలిపారు. అంతేకాక మాపై చూపించే ప్రేమని కొనగలమా.. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ల మాటలను కొనగలమా.. లేదు కదా’’ అంటూ కౌంటరిచ్చారు కార్తికేయ.
అంతేకాక ‘‘హాలీవుడ్ సినిమాలు ఇలాంటి ప్రచారం కోసం స్టూడియోలను ఆశ్రయిస్తాయి. కానీ మాకు అలాంటి ఛాన్స్ లేదు. ప్రచారం కోసం మేం రూ.5 కోట్ల బడ్జెట్ అనుకున్నాం. మొదటి దశలో మూడు కోట్లు ఖర్చు అయ్యింది. నామినేషన్స్ అయ్యాక సెకండ్ ఫేజ్లో బడ్జెట్ పెంచాం. మొత్తంగా ఎనిమిదిన్నర కోట్లు అయ్యింది’’ అని తెలిపారు కార్తికేయ. మొత్తానికి 80 కోట్ల ఖర్చు కాస్త.. వాస్తవంగా 8.5 కోట్ల రూపాయలుగా తేలింది. కార్తికేయ కామెంట్స్ వైరల్గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.