పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం గుండెపోటుతో మరణించిన ఆయన అభిమానులకు తీరని శోకాన్ని నింపారు. అయితే తమ అభిమాన నటుడు పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహాన్ని కడసారిగా చూసేందుకు అభిమానులంతా శుక్రవారం రాత్రి నుంచే కంఠీరవ స్టేడియానికి చేరుకుంటున్నారు. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాలు అన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి.
ఇక పోలీసు యంత్రాంగం కంఠీరవ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ తమ ఆధీనంలోకి తీసుకుని బెంగుళూరు అంతా హై అలెర్ట్ ప్రకటించారు. ఇక చివరిసారిగా పునీత్ రాజ్ కుమార్ ని చూసేందుకు అభిమానులంతా కడసారి చూపు కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో ఆ స్టేడియం అంతా అభిమనులతో కిక్కిరిసిపోయింది. ఇక దీంతో పాటు టాలీవుడ్ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, బాలక్రిష్ణ, యన్టీఆర్ తదితరులు పునీత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బెంగుళూరు పయనమయ్యారు.