ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మెగా ఫ్యామిలీ అభిమాని అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. చాలా సార్లు, చాలా వేదికలపై ఈ విషయాన్ని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. తాను ఈ స్థాయిలోకి రావటానికి పవర్ స్టారే కారణమని కూడా చెప్పారు. అంతేకాదు! పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కూడా ఆయన మద్దతు తెలిపారు. తన సొంత జిల్లా అయిన నెల్లూరు జనసేన పార్టీ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటూ ఉంటారు. తాజాగా, నెల్లూరు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ‘‘ పవన్ కల్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి. జనసేన పార్టీని గెలిపించండి’’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గునుకుల శ్రీధర్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ గురించి, పవన్ కల్యాణ్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ.. కట్టె కాలే వరకు పవన్ కల్యాణ్ అభిమానినేనని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తన కెరీర్ బిల్డింగ్లో పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీ చాలా సహాయం చేసిందని అన్నారు. చిన్ననాటినుంచి నెల్లూరు సిటీలో చాలా ప్రదేశాల్లో తిరిగానని చెప్పారు. నెల్లూరునుంచి వెళ్లి ప్రపంచవ్యాప్తంగా అభిమానం సంపాదించినందుకు గర్వపడుతున్నానని అన్నారు. పవన్ కల్యాణ్ అనుకున్నది నెరవేరాలని ఆకాంక్షించారు. కిషోర్, అతడి బృందానికి అభినందనలు తెలియజేశారు.
స్థానికంగా ఏదైనా సమస్య ఉంటే కిషోర్ బృందానికి చెప్పొచ్చని అన్నారు. కాగా, జానీ మాస్టర్ 2007లో వచ్చిన ‘‘ఢీ : అల్టిమేట్ డ్యాన్స్ షో’’తో బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఈ షోతోనే మంచి గురింపు తెచ్చుకున్నారు. 2009లో వచ్చిన ద్రోణా సినిమాతో డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా మారారు. తెలుగులో పలువురు స్టార్ డైరెక్టర్లతో కలిసి పని చేశారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ కొరియోగ్రాఫర్గా పనిచేశారు. దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం విజయ్ హీరోగా చేస్తున్న వారిసు, మెగా పవర్ స్టార్, శంకర్ కాంబోలో వస్తున్న ఆర్సీ 15 సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నారు.
స్నేహితుడిని అనీ చెప్పుకొని డబ్బు కొసం పదవీ కోసం ముస్లింలకి అన్యాయం చేసిన పార్టీ లో పోయే నిచులని చూసి బాధేసినా… జాని మాస్టర్ లాంటి అభిమానులని చూసి గర్వంగ ఉంది 🙏
(2/2) pic.twitter.com/TUe6d5KpN3— Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs) December 5, 2022